నటనలో ఆరితేరిన బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్, తనకు సరిహద్దులు లేవని ఋజువు చేస్తూ నటించిన చిత్రం డర్టీపిక్చర్, దాంతో దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానుల ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు విద్యాబాలన్.
ఈ మద్య ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ ధర్మపత్ని బసవ తారకం పాత్ర లో ఒదిగిపోయి విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. అసలు ఆ సినిమాలో కీలక పాత్రనే తననటనతో చాలెంజ్ చేసి అధిగమించి నటించారు. పాత్రేదైనా అందులో ఓడిగిపోయి, పాత్రే కనిపించేలా నటించటంలో ఆమెకు సాటిరాగల నటీమణులు ఉన్నారనేది అనుమానా స్పదమే.
విద్యాబాలన్ నాలుగు పదుల వయసులోకి ఇటీవలె అడుగుపెట్టారు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వయసు గురించి, ఆ వయస్సులో ఆడవారి ఆలోచనలపై చేసిన సంచలన వ్యాఖ్యలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.
అందరూ అనుకునేటట్టుగా, నలభైయవ దశకంలోకి వచ్చాక మగువలకు శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుందని, దాన్ని ఆస్వాదించే యిష్టత ఆ తరుణంలో ఉండదని అంటారు. కానీ అది నూరు పాళ్ళు నిజం కాదని అంటూ నిజానికి ఆ వయసే నిజమైన శృంగారానికి అనువైన తరుణమని, సెక్స్ పై మోజు ఎక్కువ అవుతుందనీ, నలభైల్లో స్త్రీలు ఎలాంటి ఒత్తిడికి గురికారని, ఆ వయసు మీద పడుతున్న కొద్దీ మహిళలు మరింత చురుకుగా, చలాకీగా, సంతోషంగా కనిపిస్తారు" అంటూ బోల్డ్ గా చెప్పుకొచ్చారు.
ఇరవైల్లో తన కలల సాధనలో శృంగారం గురించి ఆలోచించే తీరికగాని ఆస్వాధించే సమయంగాని ఉండేది కాదని వృత్తిలో పరితపించానని, ముప్పైల్లో తన సామర్ధ్యం గురించి తాను తెలుసు కున్నాననీ, నలభై ల్లో తన జీవితాన్ని ఇష్టపడుతున్నాననీ, పూర్తి జీవితాస్వాధనలో మునిగిపోతున్నానని ఆసక్తికర విషయాలను అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం విద్యాబాలన్ మిషన్ మంగళ అనే సినిమాలో నటిస్తున్నారు.