దశాబ్దాలపాటు వెండి తెరను ఏలిన నటి రోజా. అగ్రకథానాయకులందరితోనూ తెలుగు, తమిళ భాషల్లో నటించిన ఈ సీనియర్ నటి ఇప్పుడు బుల్లి తెరను కూడా ఏలేస్తున్నారు. నగరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై వైపీసీలో కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నా.. తన టీవీ షోలు మాత్రం వదల్లేైదు.



ఇప్పటికే రోజా బజర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా ఫుల్ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత రచ్చబండ కార్యక్రమం కూడా రోజాగా బాగానే పేరు తెచ్చిపెట్టింది. మరో కార్యక్రమం బతుకు జట్కాబండి కూడా బాగానే సాగింది. ఇప్పుడు రంగస్థలం అనే డ్యాన్స్ షోకు రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది.



ఇప్పుడు రోజా ఓ క్రైమ్ స్టోరీ సీరిస్ కు యాంకర్ గా కనిపించనున్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ షో ప్రోమో నడుస్తోంది. తస్మాత్‌ జాగ్రత్త పేరుతో ఈ క్రైమ్ షో రానుంది. అయితే మొదట్లో ఈ షోకు పోసాని కృష్ణమురళిని యాంకర్ గా అనుకున్నారట. కానీ ఎక్కడ తేడా వచ్చిందో కానీ చివరకు రోజా యాంకర్‌గా ఫైనల్ అయ్యారు. ప్రోమో కూడా ఇంట్రస్టింగానే ఉంది.



ఇప్పటికే తెలుగు ఛానల్లలో క్రైమ్ కథనాలు వస్తున్నాయి. గతంలో ఈటీవీ 2లో వచ్చిన నేరాలు ఘోరాలు చాలా పాపులర్ అయ్యింది. ఆ స్ఫూర్తితో చాలా ఛానళ్లు క్రైమ్ స్టోరీలు ప్రారంభించాయి. ఇప్పుడు న్యూస్ ఛానల్లే కాకుండా ఎంటర్‌టైన్ మెంట్ ఛానళ్లు కూడా క్రైమ్ స్టోరీలు ప్రారంభిస్తున్నాయి. మరి ఈ రోజా షా ఎంత హిట్టవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: