భారత దేశంలో వివిధ రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరానికి గాను సినీ, రాజకీయ, క్రీడారంగానికి చెందినవారికి పద్మ అవార్డులు ప్రకటించింది. తాజాగా మణిపూర్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సినీ నిర్మాత అరిబాం శ్యాం శర్మ తనకిచ్చిన పదశ్రీ అవార్డును వెనక్కిచ్చారు.
ఈశాన్య రాష్ట్రంలో పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిటిజన్ షిప్ బిల్లును వ్యతిరేకిస్తూ సినీ నిర్మాత అరిబాం శ్యాం శర్మ తనకిచ్చిన పదశ్రీ అవార్డును వెనక్కిచ్చారు.
2006లో ఆయన చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు. ఈ సేవలకుగాను ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవచ్చింది. కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లును ఆమోడించడంతో ఈశాన్యరాష్ట్రాల్లో అన్నివర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.