దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా ఆయన చేసిన పాదయాత్ర నేపథ్యంతో మహి వి రాఘవ్ యాత్ర సినిమా తెరకెక్కించారు. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను విజయ్ చిల్లా, శషి దేవి రెడ్డి నిర్మించారు. వైఎస్సార్ పాత్రలో మళయాళ స్టార్ మమ్ముట్టి నటించడం జరిగింది.


ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉందని చెప్పొచ్చు. అయితే మహానటి సినిమా బయోపిక్ సినిమాలకు ఓ ఉత్సాహాన్ని తీసుకురాగా ఆ తర్వాత వచ్చిన ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథానాయకుడు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఆ ఎఫెక్ట్ యాత్ర సినిమాపై ఎంతవరకు పడుతుందో తెలియదు.


అయితే మహానటి సినిమా దారిలోనే యాత్ర వస్తుందని అంటున్నారు. రెండిటికి పోలిక ఎక్కడ ఉంది అంటే సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకుండా ఈ బయోపిక్ రావడమే. ఏదో సావిత్రి బయోపిక్ అంటా నాగ్ అశ్విన్ అని ఒక సినిమా అనుభవం ఉన్న కుర్రాడు తీస్తున్నాడని ఆ సినిమాపై ఏమాత్రం అంచనాలు పెట్టుకోకుండా వెళ్లి సినిమా చూసి షాక్ అయ్యారు. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది.


ఇక ఇప్పుడు అదే దారిలో యాత్ర సినిమా వస్తుంది. మహి వి రాఘవ్ ఆల్రెడీ ఆనందో బ్రహ్మ సినిమా తీసి హిట్ కొట్టాడు. ఆ సినిమా సక్సెస్ తర్వాత వైఎస్ బయోపిక్ గా యాత్ర సినిమా చేశాడు. ఇప్పటికే ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. సినిమాలో ఇంకా మ్యాటర్ చాలా ఉందని చెబుతున్నాడు దర్శకుడు. మరి ఈ యాత్ర ఫలితం ఎలా ఉంటుంది అన్నది చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: