తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్, కోస్టల్ బ్యాంక్ అధినేత చిగురుపాటి జయరామ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల కారణంగానే జయరామ్ ను రాకేశ్ చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. హంతకుడు రాకేశ్ కు సంబంధించిన నేర చరిత్రను తవ్వుతున్నారు.

Image result for jayaram murder rakesh reddy


జయరామ్ మేన కోడలు శిఖా చౌదరికి స్నేహితుడైన రాకేశ్ జయరామ్‌ కు కొన్నేళ్ల కిందట నాలుగున్నర కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ సొమ్ము తిరిగి ఇచ్చే విషయంలో జయరామ్ చేస్తున్న జాప్యం అతనికి కోపం తెప్పించింది. సొమ్ము కోసం జయరామ్ ను కిడ్నాప్ చేసి బంధించిన రాకేశ్ వసూళ్ల కోసం బలవంతం చేశాడు.

Image result for jayaram murder rakesh reddy


లావాదేవీల విషయంతో జరిగిన వాదోపవాదాల సమయంలో ఆగ్రహం చెంది.. జయరామ్ పై పిడిగుద్దులు కురిపించాడట. హార్ట్ పేషంట్ కావడంతో జయరామ్ మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు. హంతకుడుగా భావిస్తున్న రాకేశ్ రెడ్డి గతంలోనూ పోలీసుల చేతికి చిక్కాడట.

Related image


ఓ ప్రముఖ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన కేసులోనూ రాకేశ్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో రాకేశ్ ను పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. రాకేశ్ మంచివాడేనని శిఖా చౌదరి స్నేహం తర్వాతే చెడు అలవాట్లు వచ్చాయని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: