టాలీవుడ్ లో ఇప్పుడు భారీ బడ్జెట్ తో సినిమాలు వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు వంద కోట్ల బడ్జెట్ తో రూపొందుతూ..ఆ రేంజ్ మించి వసూళ్లు కూడా చేస్తున్నాయి. తెలుగు లో బాహుబలి, బాహుబలి 2 రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేయగా ఆ పెట్టుబడికి పదింతలు లాభం వచ్చింది. ప్రస్తుతం తెలుగులో భారీ బడ్జెట్ తో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా..రాంచరణ్ నిర్మాతగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో భారీ తారాగణం ఉన్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ నుంచి అమితాబచ్చన్, శాండిల్ వుడ్ నుంచి సుదీప్, కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి లు నటిస్తున్నారు. చిరంజీవి సరసన నయనతార, తమన్నా లు నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. కొంత కాలంగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలకే పరిమితమైన అనుష్క చివరిగా భాగమతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో కోనవెంకట్ నిర్మాణంలో ఓ సినిమా చేయనుంది. తాజాగా ‘సైరా’లో అనుష్క మెరవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2006లో చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన అనుష్క సైరాలో కీలక పాత్ర చేస్తుందట.
కొన్ని కీలక సన్నివేశాలలో అనుష్క కనిపిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య కొరటాల శివ- చిరు కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో అనుష్క కథానాయికగా ఎంపికైందని అన్నారు. ఒకవేళ ఇప్పుడు చిరంజీవి పక్కన అనుష్క నటిస్తే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. సైరా సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోంది . ఈ సినిమాకి సంగీతం అమిత్ త్రివేది అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్గా రత్నవేలు ఉన్నారు. పాండిచ్చేరీ దగ్గర చిత్ర షూటింగ్ జరుగుతుంది.