‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేసే ఉద్దేశ్యంతో నిర్మాణం జరుపుకుంటున్న ‘సైరా’ మూవీ మొదలు పెట్టే సమయానికి దర్శకుడు సురేంద్ర రెడ్డికి ఆమూవీ పూర్తిచేసే సమయం విషయంలో కానీ అదేవిధంగా బడ్జెట్ విషయంలో కానీ మెగా కాంపౌండ్ ఎటువంటి టార్గెట్ ఇవ్వలేదు అన్న వార్తలు ఉన్నాయి. అయితే 200 కోట్ల బడ్జెట్ తో ప్రారంభం అయిన ఈమూవీ బడ్జెట్ విపరీతంగా పెరిగి పోవడంతో పాటు ఈమూవీ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకుండా ఇంకా కొనసాగుతూనే ఉండటం చరణ్ కు తీవ్ర అసహనం కలిగిస్తున్నట్లు టాక్.

దీనితో చరణ్ ఈమధ్య సురేంద్ర రెడ్డిని తన వద్దకు పిలిపించుకుని ఈమూవీ షూటింగ్ ఎట్టి పరిస్తుతులలోను మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని ఏప్రియల్ నుండి ఈసినిమాకు సంబంధించి ఒక్కరోజు కూడ చిరంజీవి వద్ద నుండి డేట్స్ ఆసించవద్దని చరణ్ స్పష్టంగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ అనుకోని డెడ్ లైన్ కు సురేంద్ర రెడ్డి కలవర పడుతున్నట్లు తెలుస్తోంది.
Chiranjeevi Sye Raa Narasimha Reddy Teaser Launch - Sakshi
వాస్తవానికి ఈసినిమాకు యాక్షన్ సీన్స్ కీలకంగా మారిన నేపధ్యంలో ఈవిషయంలో ఖంగారు పడి సినిమాను పూర్తి చేస్తే ఆఖంగారు ప్రభావం సినిమా ఫైనల్ అవుట్ పుట్ పై ఉంటుందని సురేంద్ర రెడ్డి భయపడుతున్నట్లు టాక్. దీనికితోడు ఈమధ్య విడుదలైన చాల భారీ సినిమాలు అంచనాలను అందుకోలేక ఫెయిల్ అయిన నేపధ్యంలో ఈ అనుకోని ఖంగారు ‘సైరా’ ను దెబ్బతీస్తుందని వార్తలు వస్తున్నాయి. 
1 మినిట్ టీజర్ తో మెగాస్టార్ 'సైరా' బీభత్సం.. గెట్ రెడీ..!
వాస్తవానికి చరణ్ ఈవిధంగా సురేంద్ర రెడ్డికి డెడ్ లైన్ ఇవ్వడం వెనుక కొరటాల హస్తం ఉంది అని అంటున్నారు. ‘సైరా’ నిర్మాణం పూర్తి అయితే కాని కొరటాల చిరంజీవిల మూవీ ప్రారంభం అయ్యే ఆస్కారం లేకపోవడంతో ఇలా వ్యూహాత్మకంగా కొరటాల చరణ్ చేత సురేంద్ర రెడ్డికి టార్గెట్ ఇచ్చి ఉంటాడు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: