పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో రామ్ 'ఇస్మార్ట్ శంకర్' అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ తనకు మంచి విజయాన్ని ఇస్తుందని రామ్ ఆశ పడుతున్నాడు. ఈమూవీలో రామ్ ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించ బోతున్నాడు. ఎప్పటి నుంచో తనకు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలని ఆశపడుతున్న నేపథ్యంలో రామ్ పూరీకి ఒక ఖరీదైన గిఫ్ట్ ను అమెరికా నుండి తెప్పించి పూరీకి ఈమధ్యనే పంపించాడు. 

ఈ ఖరీదైన గిఫ్ట్ ను చూసి పూరీ జోష్ లోకి వెళ్ళిపోయి ఆ గిఫ్ట్ ఫోటోని పూరీ తన ట్విటర్ ద్వారా షేర్ చేసాడు. ఈ గిఫ్ట్ ఒక కాఫీ సాచట్. ఈ కాఫీ అమెరికాలో చాలామందికి ఇష్టమైన కాఫీ "మేరా ఇస్మార్ట్ శంకర్ రామ్ నాకు ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కోపి లువాక్ కాఫీ ని గిఫ్టుగా ఇచ్చాడు. దయచేసి మీరు గూగుల్ చేయండి.. మీకు పిచ్చెక్కడం ఖాయం.  నేనిప్పుడు సిప్ చేస్తున్నా" అంటూ ట్వీట్ చేశాడు. 

దీనితో ఈ ట్విట్ ను చూసిన చాలామంది ఈ కాఫీ గురించి గూగుల్ లో సెర్చ్ చేసిన వెంటనే కొన్ని ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. ఈకాఫీ ధర కేజీ 550 డాలర్ల నుండి 700 డాలర్ల వరకు ఉంటుంది అన్న విషయం బయటపడింది. అంతేకాదు ఈ కాఫీ రుచి మహా అద్భుతంగా ఉంటుందని ఒకసారి ఈకాఫీ టెస్ట్ ను చూసినవారు జీవితంలో మర్చిపోలేరు అనే విషయాలు కూడ ఆ గూగుల్ సర్చ్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. 

ఇది ఇలా ఉండగా రామ్ పూరీ జగన్నాథ్ కు ఇచ్చిన గిఫ్ట్ విషయం ఛార్మీ వరకు వెళ్లడంతో అలాంటి గిఫ్ట్ రామ్ తనకు ఇవ్వలేదని ఈర్ష్య పడుతూ ఛార్మీ 'షిట్ షిట్ షిట్' అని ట్విట్ చేసింది. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంది. ఈ అద్భుతమైన కాఫీని కాఫీ గింజలతో పాటు పిల్లికి సంబంధించిన 'షిత్ ను కూడ మిక్స్ చేసి కాఫీ పౌడర్ గా మారుస్తారట. ఈవిషయాలు  అర్ధం అయ్యేలా ఛార్మీ ఆట పట్టించడానికి ఇలా 'షిట్ షిట్ షిట్' అంటూ ట్విట్ చేసిందని ఛార్మీ అభిమానులు జోక్స్ వేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: