ప్రముఖ టివీ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న వార్త కలకలం రేపింది.  హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో తన ఇంటిలోనే ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి ఆమె బౌతిక కాయాన్ని గాందీ ఆస్పత్రికి తరలించారు.కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా చెబుతున్నారు. మా టీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘పవిత్రబంధం’ అనే సీరియల్‌లో ఝాన్సీ నటిస్తున్నారు. 


ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతోనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సూర్య అనే వ్యక్తిని ఆరునెలలుగా ఝాన్సీని ప్రేమిస్తున్నాడని, అతనితో పరిచయమయ్యాకే సీరియల్స్‌ మానేసి ఝాన్సీ నటనకు దూరమైందన్నారు. గత కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోవాలని ఝాన్సీ బలవంతపెట్టడంతో సూర్య ఆమెను దూరం పెట్టాడని, వారు అంటున్నారు. కొంతకాలం ఆమె సహజీవనం కూడా చేసిందని కదనం.



మరింత సమాచారం తెలుసుకోండి: