ప్రముఖ నటి రాయ్‌ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మి’. కిశోర్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.  మెగాస్టార్ చిరంజీవి మూవీ 'ఖైదీ నెం.150'లో ర‌త్తాలు ర‌త్తాలు అంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించిన ల‌క్ష్మీరాయ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. ఈ సినిమా తర్వాత హిందీ, తమిళ, మలయాళం సినిమాలతో బిజీ అయిపోయిన ఈ బ్యూటీ మళ్లీ ఇన్ని రోజులకు తెలుగులో 'వేర్‌ ఈజ్ ది వెంకట లక్ష్మి' అనే సినిమాకు కమిటైంది. ఈ సినిమాలోేని తొలి లిరికల్‌ పాట విడుదలైంది.


‘పాపా నీకేందంటే ఇష్టం..’ అంటూ సాగే ఈ పాట కుర్రకారును ఆకట్టుకుంటోంది. మాస్‌ హంగులు జోడించి ఈ పాటను చిత్రించారు. పూజిత పొన్నాడ, కార్తిక్‌, ప్రవీణ్‌, మధునందన్‌, బ్రహ్మాజీ, ‘జబర్దస్త్‌’ మహేశ్‌, జెమిని నరేశ్ తదితరులు సహాయ పాత్రలు పోషించారు. మ‌హ‌త్, న‌వీన్ నేని, పంక‌జ్ ఈ సినిమాలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పూజిత పొన్నాడ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించ‌నుంది. హ‌రి గౌర వేర్ ఈజ్ వెంకట‌ల‌క్ష్మికి సంగీతం అందిస్తున్నాడు.

Related image

ఇందులో రాయ్ ల‌క్ష్మీ అందాల‌ని చూపిస్తూ యూత్‌కి మాంచి కిక్కిస్తుంది. ఈ సినిమాలో రామ్ కార్తిక్ హీరోగా న‌టిస్తుండగా.. పూజిత పొన్నాడ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. హ‌రి గౌర సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ల‌క్ష్మీరాయ్, పూజిత పొన్నాడ‌, మ‌హ‌త్, న‌వీన్ నేని, పంక‌జ్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు: కిషోర్ కుమార్, నిర్మాత‌లు: ఎం శ్రీ‌ధ‌ర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కె రెడ్డి, బ్యాన‌ర్: ఏబిటి క్రియేష‌న్స్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: సాయి దీపక్, క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు: తాట‌వ‌ర్తి కిర‌ణ్, మ్యూజిక్: హ‌రి గౌర‌, సినిమాటోగ్ర‌ఫి: దినేష్ ర‌వీంద్ర‌నాథ్, ఆర్ట్ డైరెక్ట‌ర్: హ‌రి వ‌ర్మ‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: