వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రధానాంశంగా తెరకెక్కుతున్న యాత్ర చిత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రేపు వెండితెరపై ప్రారంభంకానున్న యాత్రకు మంచి బజ్ క్రియేటైంది. ఈ సినిమా టిక్కెట్‌ వేలంలో లక్షల్లో అమ్ముడవడం ఈ సినిమా క్రేజ్ ను చూపిస్తోంది.

Image result for yatra movie images


ప్రత్యేకించి ప్రధాన పాత్రను మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి పోషించడం ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అయ్యింది. ఆయన చాలా శ్రద్దగా తన సొంత గొంతుతో డైలాగులు చెప్పడం ఈ సినిమా రేంజ్ ను పెంచింది. ఆయన గంభీరమైన స్వరంతో.. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ చెబుతున్న డైలాగులు ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

Related image


ఇక మరో ప్లస్ పాయింట్ పెంచల దాస్ పాట. మరుగైనావా రాజన్నా.. అంటూ పెంచలదాస్ ఆలపించిన ఈ గీతం.. అందరి హృదయాలను ద్రవింపజేసోతంది. పెంచలదాస్ ఈ పాటను ప్రాణంపెట్టి పాడాడని ప్రశంసలు వస్తున్నాయి. గొంతును వణికిస్తూ మాటతోనే కన్నీరు పలికించిన ఈ గీతం ఈ సినిమాకు హైలెట్ కానుంది.

Related image


పెద్దగా హడావిడి లేకుండా సైలంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరగడంతో హిట్ కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విపరీతమైనక అంచనాలతో ఎన్టీఆర్ నిరాశపరచగా.. సైలంట్ గా వచ్చిన యాత్ర హిట్ కొడుతుందన్న టాక్ బాగా వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: