ఎన్నో ఆశలతో అంచనాలతో రూపొందించిన ఎన్టీఆర్ కధానాయకుడు డిజాస్టర్ కావడంతో మహానాయకుడు మూవీపై ఆ అఫెక్ట్ దారుణంగా పడుతోంది. అసలు ఆ సినిమా ఎపుడు రిలీజ్ చెస్తారు. ఏంటి అన్న దానిపై ఎవరూ కూడా క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. హీరో బాలయ్య, దర్శకుడు క్రిష్ ఇద్దరూ కూడా తీవ్రమైన వత్తిడిలో ఉన్నారు. ఓ వైపు మణి కర్ణిక మూవీని వదులుకుని మరీ వచ్చిన క్రిష్ కి ఇక్కడ ఎన్టీఆర్ కధానాయకుడు హిట్ ఇవ్వలేదు. మరో వైపు మణి కర్ణిక హిట్ కొట్టింది.  దాంతో ఆయన సైతం డిప్రెషన్ మూడ్ లో ఉన్నారని టాక్ నడుతోంది. మొత్తానికి మహా నాయకుడు జాతకం మాత్రం ఆ ఇద్దరి చేతుల్లోనే ఉంది.


ఈ నేపధ్యంలో మహానాయకుడు ని పూర్తిగా రీషూట్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. మొదట అనుకున్నట్లుగా కాకుండా ఈ మూవీని జనాలకు నచ్చే విధంగా డిజైన్ చేయడానికి చిత్ర యూనిట్ సిధ్ధపడుతోందట. అందులో భాగంగా యంగ్ ఎన్టీఆర్ పాత్రకు ఒక కొత్త నటుడిని తీసుకున్నారని అంటున్నారు. ఆ పాత్రకు జోడీగా యంగ్ బసవతారకం గా మరో నటిని కూడా తీసుకున్నారుట. అంటే  అన్న గారి యవ్వన జీవితం గురించి మరో మారు జనానికి చెబుతూ ఈ కధలో ఆ టెంపో మిస్ కాకుండా చూడాలన్నది ప్లాన్ గా ఉందంటున్నారు


ఇక ఈ మూవీలో ఎక్కడ ఎమోషన్లు మిస్ కాకుండా చూసుకోవడం, కీలకమైన మలుపులు ఉండేలా జాగ్రత్త పడడం వంటి రిపేర్లు చేసుకుంటున్నారుట. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చి సినిమా బాగుందని అంతా అనుకున్న మీదటనే రిలీజ్ డేట్ బయటకు వస్తుందని అంటున్నారు. ఇప్పటికైతే మహా శివరాత్రి ని టార్గెట్ చేస్తూ మూవీ షూటింగ్ జరుపుతున్నారట. మరి చూడాలి మహానాయకుడు కొత్త మెరుపులు ఏంటో.



మరింత సమాచారం తెలుసుకోండి: