సంక్రాంతి భరిలో రిలీజ్ అయిన వినయ విధేయ రామ ఫ్లాప్ టాక్ ను స్వంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వ్యవహారం నిర్మాత దానయ్యకు దర్శకుడు బోయపాటికి మధ్య తారాస్థాయిలో వాదోపవాదాలు జరిగినట్లు తెలుస్తోంది. వినయ విధేయరామ సినిమా విడుదల తరువాత వచ్చిన ఫలితంతో హీరో రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయానికి దర్శకుడు బోయపాటి తలవొగ్గకపోవడం అన్నది ఈ పరిస్థితికి దారితీసినట్లు తెలుస్తోంది. టోటల్ వ్యవహారం ఇలావుంది. సినిమా విడుదలైన తరువాత ఫలితం తేలిపోవడంతో రామ్ చరణ్య ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ ఓ లేఖ తయారు చేయించారు. అయితే ఆఖరికి టోటల్ గా బయ్యర్లు ముఫైకోట్ల వరకు లాస్ అని లెక్కతేల్చారు.

Image result for boyapati srinu

దాంతో తన రెమ్యూనిరేషన్ నుంచి అయిదు కోట్లు వెనక్కు ఇస్తానని, మీరూ తలా అయిదు ఇస్తే యాభైశాతంగా పదిహేను కోట్లు వెనక్కు ఇచ్చేయవచ్చని రామ్ చరణ్ ప్రతిపాదించారు. దానికి నిర్మాత దానయ్య ఓకె అన్నారు. అక్కడి నుంచి బోయపాటికి కబుర్లుచేయడం, సరైన స్పందన రాకపోవడం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో దిల్ రాజును పెద్దమనిషిగా పెట్టి నిన్ననో, మొన్ననో మీటింగ్ పెట్టారు.

Image result for dvv danayya

ఆ మీటింగ్ లో తాను అయిదు కోట్లు ఇవ్వలేనని, ఒకటో రెండో ఇస్తానని బోయపాటి చెప్పినట్లు తెలుస్తోంది. 15కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుని, వందకోట్లు ఖర్చు పెట్టించి, ఇలాంటి సినిమా ఇచ్చి, ఇప్పుడు వెనక్కు ఇవ్వనంటే ఎలా అని దానయ్య నిలదీసినట్లు తెలుస్తోంది. దాంతో అలా అలా మాటా మాటా పెరిగిపోయింది. ఇద్దరూ ఒక స్థాయిలో గట్టిగా బూతులు తిట్టుకున్నట్లు తెలుస్తోంది. దాంతో మధ్యన వున్న పెద్ద మనుషులు విడదీసినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: