తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య చిన్న చిత్రాలకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోతుంది.  యూత్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’తెరకెక్కించారు.  ఈ చిత్రం బోల్డ్ కంటెంట్ ఉండటంతో మొదట విమర్శలకు గురైనా తర్వాత యూత్ కి బాగా కనెక్ట్ కావడంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.  ఈ చిత్రంతో యూత్ ఐకాన్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ.  ఈ చిత్రాన్ని తమిళంలో బాల దర్శకత్వంలో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. 


ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.  'ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్' వారు నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణను పూర్తిచేసుకుంది.   త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా భావిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు.


మొత్తం అవుట్ పుట్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన నిర్మాతలు, మొదటి నుంచి రీషూట్ చేయాలనే అభిప్రాయానికి వచ్చేశారు. హీరో 'ధృవ్' ను మాత్రమే వుంచి, దర్శకుడితో పాటు మిగతా నటీనటులను .. సాంకేతిక నిపుణులను మార్చేయాలనే నిర్ణయం తీసేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటన చేయడం మరో విశేషం. అయితే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అన్న దానిపై  కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: