తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో మహానటి, ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి.  అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’మంచి సక్సెస్ సాధించింది.  క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు.  ఈ చిత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం సాధించలేదు.

ఈ చిత్రంలో ఎక్కువ శాతం సన్నివేశాల కన్నా పాటలతోనే పూర్తి చేశారన్న టాక్ వినిపించింది.  తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా మహి వి రాఘవ్ ‘యాత్ర’చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ చిత్రం నేడు రిలీజ్ అయ్యింది.  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ వచ్చింది.  ఈ సందర్భంగా వైసీపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.  కావలిలోని లత థియేటర్ లో యాత్ర చిత్రం విడుదల సందర్భంగా కేక్ కట్ చేసిన మాజీ ఎంపీ మేకపాటి  రాజమోహన్‌రెడ్డి కట్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కేతిరెడ్డి రామకోటా రెడ్డి, జగదీష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ..యాత్ర చిత్రానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన రావడం ఆనందంగా ఉందని అన్నారు. వై.ఎస్.ఆర్ పాలనతో ప్రజలను మెప్పించారని.. వైఎస్సార్‌పై సినిమా అంటేనే ప్రజలంతా ఆసక్తిని కనబరిచారని, ఆయన తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. యాత్ర సినిమాలో మమ్ముట్టి బాగా నటించారని అన్నారు. మొత్తానికి యాత్ర పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతూ ఉండటంతో.. వైఎస్సార్‌ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: