రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన యాత్ర సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ను స్వంతం చేసుకున్నది. అయితే దాదాపు అన్ని జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లిపోయారు. కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో కోలాహలం ఎక్కువగా కనిపించింది. ఎమ్మెల్యేలు, పార్టీ కీలకనేతలు తన అనుచరుల కోసం థియేటర్లలోని సీట్లన్నీ బుక్ చేయించారు. ఉదయం ఆటతోనే యాత్రకు వైఎస్సార్ అభిమానులు క్యూ కట్టారు. సినిమాకు పాజిటవ్ టాక్ రావడంతో కార్యకర్తల ఆనందానికి అవధుల్లేవు. యాత్ర థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపించింది.


గుండెలు పిండే సన్నివేశాల తో యాత్ర బంపర్ హిట్ ...!

వైసీపీ నేతలు సినిమాని ఓన్ చేసుకున్నా.. పార్టీలకతీతంగా ప్రజలు మొదటిరోజే సినిమాని చూడటానికి ఉత్సాహం చూపించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ కి, వైఎస్సార్ యాత్రకు తేడా తెలుసుకోవడం కోసం ఎక్కువమంది చూశారు. ఎన్టీఆర్-కథానాయకుడులో ఏది మిస్ అయిందో, యాత్ర సినిమాలో సరిగ్గా అదే హిట్ అయింది. అదే ఎమోషన్. భావోద్వేగాలు పెర్ ఫెక్ట్ గా పండడమే యాత్రకు ప్లస్ అయింది.


గుండెలు పిండే సన్నివేశాల తో యాత్ర బంపర్ హిట్ ...!

రెండు సినిమాల మధ్య ఇదే పెద్ద తేడా అంటున్నారు విశ్లేషకులు. ఎన్టీఆర్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి టీడీపీ నేతలు చేసిన ఓవరాక్షన్ సినిమాకి మైనస్ కాగా, సినిమా విడుదల వరకు వైసీపీ నేతలు పాటించిన సంయమనం యాత్రపై పొలిటికల్ రిమార్క్ లేకుండా చేసి ప్లస్ అయింది. రిలీజ్ దగ్గరపడినప్పుడు మాత్రమే నేతల సందడి కనిపించింది. విదేశాల్లో కూడా వైసీపీ అభిమానులు యాత్ర రిలీజ్ ను పండగలా జరుపుకున్నారు. మొత్తానికి యాత్ర సినిమా వైసీపీలో జోష్ పెంచగా, టీడీపీ నేతలు ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 ఫలితం ఎలా ఉంటుందో అని అయోమయంలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: