సాధారణంగా సినీ హీరోయిన్లు గ్లామర్ ప్రదర్శనతో యూత్ ని ఆకట్టుకోవడం చూస్తునే ఉన్నాం. కొంత మంది హీరోయిన్లు చాలా వయసు వచ్చే వరకు మంచి ఫిట్ నెస్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంటారు. కొంత మంది హీరోయిన్లు అతి తక్కువ కాలంలోనే ఊభకాయంతో సినిమాకు దూరం అవుతున్నారు. టాలీవుడ్ లో పూరి జగన్నాధ్, నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’సినిమాతో పరిచయం అయిన అదాశర్మ తర్వాత పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ పాత్రల్లో కూడా నటించింది.
ఆ మద్య అదాశర్మ నటించిన క్షణం సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. తాజాగా సంప్రదాయ క్రీడ మల్లకంబను కథానాయిక అదాశర్మ సునాయాసంగా చేసేస్తున్నారు. గతంలో తన తల్లి పోల్ సహాయంతో మల్లకంబ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. తాజాగా అదా తాడు సహాయంతో మల్లకంబ చేస్తున్న వీడియోను సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.మల్లకంబ ఒలింపిక్ క్రీడల్లో ఒకటి కాబోతోందని, ఫిబ్రవరి 16, 17న ముంబయిలోని శివాజీపార్కు వద్ద తొలి మల్లకంబ ఛాంపియన్ షిప్ పోటీలు జరగబోతున్నా యని ట్వీట్ చేశారు.
అదా మల్లకంబ నైపుణ్యం చూసిన నెటిజన్లు ఇంత టాలెంట్ ఎక్కడ దాచావ్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ‘క్షణం’ తర్వాత రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న ‘కల్కి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ సినిమాను నిర్మిస్తున్నారు. మేలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క అదా హిందీలో ‘కమాండో 3’, ‘బైపాస్ రోడ్’ సినిమాల్లో నటిస్తున్నారు.