ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ‘సాహో’ విడుదల తేది గురించి ఎదురు చూస్తున్న పరిస్థితులలో ఈ మూవీ విడుదల అయ్యే ఆగస్ట్ 15న మరో సినిమా విడుదల లేకుండా చాలా వ్యూహాత్మకంగా ‘సాహో’ ఫిలిం మేకర్స్ వ్యవహరిస్తున్నారు.   దీనితో ఈ సినిమాకు అసలు  పోటీలేదు అని అనుకుంటున్న తరుణంలో కోలీవుడ్ టాప్ హీరో సూర్య రంగంలోకి దిగి ‘సాహో’ కి ఊహించని షాక్ ఇవ్వబోతూ ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది. ‘రంగం’ సినిమాతో బాగా పాపులర్ అయిన  దర్శకుడు కెవి ఆనంద్ సూర్య మోహన్ లాల్ తో కలిపి తీస్తున్న మూవీ ‘కాప్పన్’ తమిళ తెలుగు మళయాళ భాషలలో ఆగస్ట్ 15న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. 
 

అయితే తెలుగులోకి ఈమూవీ ఏ టైటిల్ తో విడుదల చేయబడుతుంది అన్న విషయం ఇంకా డిసైడ్ చేయలేదు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో దేశభక్తిని మిక్స్ చేసి తీస్తున్న ఈ మూవీలో మోహన్ లాల్ తన కెరీర్ లో మొట్టమొదటిసారి భారతదేశ ప్రధాన మంత్రిగా నటిస్తున్నాడు. ఆయనను కంటికి రెప్పలా కాపాడే పోలీసు ఆఫీసర్ పాత్ర సూర్యది. ఈ మూవీలో విలన్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన ఆర్యా నటిస్తున్నాడు. 
 #18yearsofeminentSuriya
ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్న ఈమూవీని సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్నట్లు సమాచారం. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నిర్మింపబడుతున్న ఈమూవీ ప్రస్తుత రాజకీయాల నేపధ్యంలో ఉండటంతో ఈ మూవీలోని కథ అందరికీ కనెక్ట్ అవుతుంది అని అంటున్నారు. సూర్య సినిమాలకు తెలుగులో కూడ మంచి మార్కెట్ ఉండటమే కాకుండా అతడికి తెలుగు రాష్ట్రాలలో కూడ చాలామంది అభిమానులు ఉండటంతో ‘సాహో’ మ్యానియాను లెక్క చేయకుండా ఈ సాహసం చేస్తున్నట్లు టాక్. 
Suriya images
అయితే ఇది అంతా ఈసినిమా ప్రచారం కోసం వేసిన ఎత్తుగడ అనీ చివరి నిముషంలో ఈసినిమా విడుదలను వాయిదా వేస్తారని మరి కొందరు అంటున్నారు. దీనికితోడు గతంలో సూర్య ‘బాహుబలి’ సినిమాను తానే స్వయంగా తమిళంలో విడుదల చేసిన నేపధ్యంలో ప్రభాస్ ను ఎట్టి పరిస్తుతులలోను సూర్య కార్నర్ చేయడు అన్న అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: