రకుల్ ధైర్యం గురించి కార్తీ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసినాడు. కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'దేవ్'. సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కార్తి మాట్లాడుతూ...ఒక్కో జనరేషన్ ఆలోచన ఒక్కోలా ఉంటుంది. ఇదొక బ్యూటిఫుల్ స్టోరీ. ఫ్రెండ్షిప్ ఉంటుంది. మోస్ట్ ఛాలెంజింగ్ లవ్ ఉంది. ఐదేళ్ల క్రితం తీసుకుంటే అమ్మాయిలను కలవడం అంటే కాలేజీలోనో, బస్ స్టాప్‌లోనో కలిసేవారం. ఇపుడు ఇంటర్నెట్ ద్వారా ఎక్కడో న్యూయార్కులో ఉన్న అమ్మాయిని కూడా కలవొచ్చు. ఈ జనరేషన్‌ ఆలోచనలకు దగ్గరగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. 

ఇద్దరివీ డిఫరెంట్ క్యారెక్టర్స్

లవ్ అనేది కూడా ఒక అడ్వెంచర్ లాంటిదే. యువతరం ఈ కథకు కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఇపుడు సింగిల్ పేరెంటింగ్, బ్రోకెన్ మ్యారేజెస్ కామన్ అయిపోయాయి. బ్రేకప్స్ ఈజీ అయిపోయాయి. ఈ జనరేషన్ ఫ్రెండ్షిప్, లవ్ విషయాల్లో ఎలా ఆలోచిస్తారు అనేది ఈ సినిమా చెబుతుంది. సినిమా మొత్తాన్ని స్టైలిష్‌గా చేయాలనుకున్నాం. కథ వినగానే వెంటనే బిఎండబ్ల్యు బైక్ బుక్ చేశామని కార్తి తెలిపారు. 

భిన్నమైన చిత్రం

ఖాకీ సినిమా షూటింగ్ జరిగేపుడు రకుల్ ఎప్పుడూ వాయిస్ మెసేజ్ పెడుతుండేది. ఇది జరుగలేదు, అది జరుగలేదు, ఏం పీకుతున్నారు అని సందేశాలు పంపేది. బిజినెస్ ఉమెన్ క్యారెక్టర్‌కు రకుల్ పర్ఫెక్టుగా సెట్టవుతుంది అని అప్పుడే అనిపించిందని కార్తి తెలిపారు. నా క్యారెక్టర్ ఒక ట్రావెలర్. అతడికి అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం లేదు. అతడిని కూడా భయపెట్టే స్థాయిలో హీరోయిన్ పాత్రను డిజైన్ చేశారు. లవ్ స్టోరీ కాబట్టి ఇద్దరికీ సమానమైన ప్రధాన్యత ఉంటుంది. నా క్యారెక్టర్‌కు డబ్బు అంటే అంత మఖ్యం కాదు, ఆమె క్యారెక్టర్‌కు డబ్బు అంటే చాలా ఇంపార్టెంట్ అని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: