రామ్ గోపాల్ వర్మ.. సినిమాకు ప్రచారం చేసుకోవడంలో ఈయన మహా దిట్ట. కేవలం ట్విట్టర్ పోస్టుల ద్వారానే కావలసినంత ప్రచారం తెచ్చేసుకుంటారు. ఆయన సోషల్ మీడియా వాడకం అలా ఉంటుంది మరి. కానీ.. ఇప్పుడు ఆ వాడకం కొత్త పుంతలు తొక్కింది.



చివరకు ప్రధాని నరేంద్ర మోడీని కూడా తన సినిమా వాడకానికి వాడేసుకున్నాడు వర్మ. అదేంటి ప్రధాని మోడీ ఏంటి.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రచారం ఏంటి అనుకుంటున్నారా.. అవును మరి. నరేంద్ర మోడీ తన ఏపీ పర్యటనలో చంద్రబాబుపై దారుణంగా విరుచుకుపడ్డారు.



పార్టీలు ఫిరాయించడంలో, కొత్త కొత్త కూటములు కట్టడంలో, మామాగారిని వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో ఎదగడంలో చంద్రబాబు తనకంటే సీనియర్‌ అని మోడీ గుంటూరు సభలో బాబును కుమ్మేశారు. అంతే.. తనకు కావలసిన మసాలా దొరికిందని ఆర్జీవీ సంబరపడిపోయారు.



వర్మ కాన్సెప్టు కూడా అదే కదా.. చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచాడనే కదా.. ఇప్పుడు మోడీ కూడా అదే మాట చెప్పాడు. అంతే.. మోడీ చెప్పిన ఆ మాటల వీడియోను తన ట్విట్టర్లో పోస్టు చేసి.. తన సినిమాకు నరేంద్ర మోడీకూడా పబ్లిసిటీ చేస్తున్నారని కామెంట్ పెట్టేశాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్జీవీనా మజాకా..


మరింత సమాచారం తెలుసుకోండి: