వైఎస్ జగన్ ఏపీలో ప్రతిపక్ష నాయకుడు. కాబోయే ముఖ్యమంత్రి  అన్న ట్యాగ్ ఉంది. విపరీతమైన జనం ఫాలోయింగ్ ఉంది. మరి దివంగత వైఎస్సార్ కుమారుడు జగన్. అటువంటి  యువ నేత అంటే ఆషా మాషీ కాదు కదా కానీ. జగన్ తాను సామాన్యంగానే ఉంటానని అంటున్నాడుట. ఏంటది.. ఏమా కధ.

 

తన తండ్రి దివంగత వైఎస్సార్ పాదయాత్రను బేస్ చేసుకుని తీసిన మూవీ యాత్ర.   ఏపీలో ఇపుడు హాట్ టాపిక్ అయింది ఈ మూవీ డీసెంట్ హిట్ అయింది. గత మూడు రోజులుగా ఈ  మూవీపై ఏపీలో ఇంటెరెస్టింగ్ టాక్ నడుస్తోంది. మరి ఈ మూవీ మీద జగన్ అభిప్రాయం ఏంటి. ఆయన ఈ మూవీ చూశారా ఇవన్నీ సగటు జనానికి సందేహాలే. ఎందుకంటే జగన్ ఈ మూవీ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. హైప్ క్రియేట్ చేయలేదు. తనకు పట్టనట్లుగానే ఉండిపోయారు.

 

 అయితే ఇపుడు ఈ మూవీ హిట్ కావడంతో చిత్ర యూనిట్ మర్యాదపూర్వకంగా జగన్ని వెళ్ళి కలుసుతుంది. ఈ డైరెక్టర్ మహి మూవీ గురించి జగన్ కి వివరించారు. సినిమా హిట్ కావడం పట్ల జగన్ హర్షం వ్యక్తం చేశారట. ఈ మూవీ చూడాలని, స్పెషల్ షొ  వేస్తామని కూడా ఫిల్మ్ యూనిట్  చెప్పిందట. దాన్ని సున్నితంగా తోసిపుచ్చిన జగన్ తానే ధియేటర్ కి వచ్చి మూవీ చూస్తానని, జనంతో సినిమా చూడడమే తనకు చాలా ఇష్టమని చెప్పారట. మరి రెండు మూడు రోజుల్లో జగన్ సినిమా హాల్లో  వైఎస్సార్ అభిమానుల మధ్యనే ఉండి ఈ మూవీ చూస్తారని తెలుస్తోంది. మరి ఆ రోజు సినిమా హాల్లో  సందడి ఓ రేంజిలో ఉండదుగా.


మరింత సమాచారం తెలుసుకోండి: