తెలుగు సినిమా రంగంలో మెరుపులు మెరిపిస్తున్న కన్నడ సింధూరం రష్మిక మందన. గీతాగోవిందంలో గీతగా ఆమె నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. గీతా అంటూ కుర్ర కారు తమ గుండెల్లో గుడి కట్టేసుకున్నారు. అందం, చందం దండిగా ఉన్న నిండు చందమామగా రష్మికను జనం అభిమానిస్తున్నారు. ఆరాధిస్తున్నారు.

 

అటువంటి రష్మిక ఓ సమస్యతో బాధ పడుతోందట. అదేంటి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఉంటూ ఓవర్ నైట్  స్టార్ డం సాధించిన రష్మికకు ఉన్న ప్రాబ్లమ్స్  ఏంటి అన్న డౌట్లు ఎవరికైనా రావచ్చు. ఆమె ఆ సంగతి క్లారిటీగా చెబుతోంది మరి. అవును... రష్మికకు చాలా సిగ్గు అంటా - ఇన్ని సినిమాల్లో నటించిన తర్వాత కూడా ఇంకా కెమెరా ముందుకు వెళ్లాలంటే సిగ్గు - కెమెరా ముందు చాలా సిగ్గు పడి పోతూ టేక్ ల మీద టేక్ లు తింటూ ఉంటానంటూ చెప్పుకొచ్చింది. ఇక ఏదైనా స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడాలన్నా కూడా చాలా సిగ్గు అంది. ధైర్యం చేసి కొంత మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని - ఎక్కువ మాట్లాడలేనని చెప్పింది.

 

ఈ సిగ్గు పోవాలని రష్మిక తెగ ప్రయత్నం చేస్తోందట. కానీ అది ఆమెను వదిలిపోవడంలేదుట. అవును ఈ సిగ్గుల మొగ్గకు అది ఆభరణమే కదా. దీని మీద సోషల్ మీడియాలో అభిమానులు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. రష్మిక సిగ్గు  పడితేనే అందం. ఎందుకు దాన్ని వదిలించుకోవడం అంటున్నారు. సిగ్గు సహజ లక్షణమే తప్ప మరేం కాదని కూడా అంటున్నారు. కీప్ ఇట్ అప్ రష్మికా అంటున్నారు. మరి సిగ్గుకు రష్మిక  విడాకులు ఇస్తుందో, లేక దాన్ని అట్టేపెట్టుకుని అలరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: