టాలీవుడ్ లో డబులు మీనింగ్ డైలాగ్స్ తో బోల్డ్ కంటెంట్ సినిమాలతో యూత్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా  పేరు తెచ్చుకున్న మారుతి తర్వాత సుధీర్ బాబు తో ‘ప్రేమకథా చిత్రమ్’సినిమాతో ఒక్కసారే కామెడీ డైరెక్టర్ గా మారారు.  ఇక నేచురల్ స్టార్ నానితో తీసిన్ ‘భలే భలే మగాడివోయ్’సినిమాతో కామెడీ, ఫ్యామిలీ దర్శకుడిగా మారిపోయారు.  అప్పటి నుంచి పలు సినిమాలు తీసిన మారుతి చివరగా అక్కినేని నాగ చైతన్య, మెహ్రిన్ జంటగా ‘శైలజారెడ్డి అల్లుడు’సినిమా తీశారు. 
Image result for nani
ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు.  త్వరలో మారుతి నాని కానీ..సాయి ధరమ్ తేజ్ తో కానీ ఓ సినిమా తీయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.  తాజాగా ఈ విషయం పై స్పందించిన మారుతి  త‌న ట్విట్ట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చాడు. డియ‌ర్ మీడియా ఫ్రెండ్స్‌, నేను చేయ‌బోయే త‌ర్వాతి చిత్రానికి సంబంధించి అనేక ఆర్టిక‌ల్స్ చ‌దివాను.
Image result for sai dharam tej
మీరు ఎవ‌రి గురించి అయితే చెబుతున్నారో వారితో చేయాల‌ని నాకుంది. కాని ప్ర‌స్తుతం నేను ఎంతో ఎగ్జయిట్ అయిన పాయింట్‌తో కథను సిద్ధం చేసే పనిలో ఉన్నా.  త్వరలో దానికి సంబంధించిన స్క్రిప్ట్ తయారు చేస్తాను..అప్పుడు అన్ని వివరాలు నేనే స్వయంగా తెలుపుతానని అన్నారు. అందరికీ ధన్యవాదాలు..అని త‌న ట్వీట్‌లో తెలిపారు. దీంతో కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారానికి పులిస్టాప్ ప‌డింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: