టాలీవుడ్ లో మెగా హీరోలకు ఉన్న ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఎంతో కష్టపడి వేసిన బాటలో ఇప్పటి నవతరం హీరోలు నడుస్తున్నారని ఆ మద్య ఓ ఫంక్షన్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. ఇప్పడు వస్తున్న ప్రతి హీరో తమ రోల్ మోడల్ మెగాస్టర్ చిరంజీవి అని..ఆయన చెట్టు నీడన తాము చల్లగా ఉన్నామని అంటూ ఉంటారు. అయితే చిరంజీవి పది సంవత్సరాల విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.
మెగాస్టార్ తో కలిసి నటించే అవకాశం అప్పట్లో పవన్ కళ్యాన్ కి దక్కింది. ఆ తర్వాత రాంచరణ్ నటించిన మగధీర సినిమాలో ఓ పాటలో తనయుడితో స్టెప్పులు వేశాడు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా సైరా నరసింహరెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.
ఈ సినిమాలో బన్నీ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని టాలీవుడ్ టాక్. రేసు గుర్రం సినిమా నుంచి దర్శకుడు సురేందర్ రెడ్డి, బన్నికి మద్య మంచి స్నేహ సంబంధాలు ఉండటం..మెగాస్టార్ తో ఎప్పటి నుంచో నటించాలని కోరిక ఉండటంతో ఈ సినిమాలో నటించే అవకాశం దక్కిందని టాలీవుట్ టాక్. కాకపోతే ఈ విషయం పై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
అంతేకాకుండా ఈ సినిమాలో మెగా వారసురాలు నిహారిక కూడా ఓ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను దసరాకు విడుదల చేయనున్నారని సమాచారం.