టాలీవుడ్ లో వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి బరిలో ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ చేశారు. మొదటి నుంచి ఎన్నో అంచనాలు పెంచుతూ వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా వసూళ్ల పరంగా పూర్తిగా ఢీలా పడిపోయింది. అయితే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’సినిమాలో కేవలం పాటలు, కొన్ని సన్నివేశాలు మాత్రమే చూపించారని..అవికూడా పెద్దగా ఆసక్తికరంగా లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ పడ్డారు.
ఈ ఎఫెక్ట్ కలెక్షన్ల పై కూడా పడింది. దాంతో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాపై బాగా ఫోకస్ చేయడం ప్రారంభించారు..కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. మొన్నే ఈ పెండింగ్ షూటింగ్ అంతా పూర్తయిందట. దీంతో రిలీజ్ డేట్ ను ఫైనలైజ్ చేశారు. వాస్తవానికి ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా ఫిబ్రవరి 7న రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ చేశారు.
అయితే రిలీజ్ డేట్ మాత్రం బయలకు రాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం మహానాయకుడి రాక ఖరారయింది. ఫిబ్రవరి 22 న 'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఇక మొదటి భాగం బయ్యర్లకు 25% నష్టపరిహారం ఇవ్వడానికి బాలకృష్ణ నిర్ణయించుకున్నారట. సురేష్ మూవీస్ ద్వారా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రానుంది.