తెలుగు ఇండస్ట్రీలో శివ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాంగోపాల్ వర్మ తర్వాత కామెడీ, హర్రర్, మాఫియా నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కించారు.  అప్పట్లో ఆ చిత్రాలకు మంచి క్రేజ్ కూడా వచ్చింది.  కానీ తర్వాత వచ్చిన చిత్రాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రేక్షకులు..దాంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు హిట్, ఫ్లాప్ చిత్రాలు తీశారు.
Image result for laxmis ntr movie stills
ప్రస్తుతం టాలీవుడ్ పై దృష్టి పెట్టిన రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం షూటింగ్ మొదలు నేటి వరకు ఎన్నో విషయాలు హైలెట్ చేస్తూ అంచనాలు పెంచుతున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేస్తూ ప్రేక్షకులకు రక రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు.  లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేశారు.  ఇలా ప్రతిరోజూ చిత్రం పై ఎదో రకంగా ఇంట్రెస్టింట్ ట్విట్స్ పెడుతున్నారు.  తాజాగా మరో సంచలన ట్విట్ పెట్టి ఆకర్షించే ప్రయత్నం చేశారు.

‘ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. 9:27AM కల్లా మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్ళకి నేను బాధ్యుడిని కాదు’ అంటూ రాసుకొచ్చాడు. నిన్న లక్ష్మీపార్వతి వెళ్లి మోదీని కలిస్తే అది కూడా తన సినిమా ప్రమోషన్ కోసం వాడేసుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: