ఈ మద్య సినిమా హీరోయిన్లు సినిమాల్లో కన్నా మ్యూజికల్ నైట్స్, షాపింగ్ ఓపెనింగ్స్ లో ఎక్కువ పాల్గొంటున్నారు.  షూటింగ్ లో ఎప్పుడూ బిజీగా ఉండే వీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ తో కాస్త రిలీఫ్ అవడమే కాదు డబ్బు కూడా వస్తుండటంతో వాటివైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.  తాజాగా ప్రముఖ భోజ్‌పురి నటి అక్షరాసింగ్ పాల్గొన్న కార్యక్రమంలో రాళ్లదాడి జరిగింది. ఈ ఘటన బీహార్‌లోని పట్నాలో చోటుచేసుకుంది.   
Bhojpuri actress Akshara Singh's dance performance was cut short in Aurangadbad, Bihar
బీహార్‌లోని పట్నాలో  సూర్య మహోత్సవ్  ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి అధికంగా జనాలు హాజరయ్యారు.  దాంతో ఇక్కడ తొక్కిసలాట జరగడంతో కుర్చీలను విరగ్గొట్టారు. ఈ గందరగోళంలో కొందరు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు.  ఈ అల్లర్లు జరగకముందే నిర్వాహకులు కార్యక్రమం శాంతియుతంగా జరిగేలా చూడాలని కోరారు. కాకపోతే అక్కడ భారీ బందోబస్తు మాత్రం చేయలేదనే టాక్ వినిపిస్తుంది.

దీనికితోడు కార్యక్రమానికి లెక్కకుమించి జనం హాజరయ్యారు. వీరందరికీ కార్యక్రమం చూసేందుకు అవకాశం దక్కకపోవడంతో గందరగోళం చెలరేగింది.  మొత్తానికి అక్కడి పోలీసులు అల్లరి ముఖను అరెస్ట్ చేయడం..గొడవలు సర్ధమణిగింది. కాగా అక్షరాసింగ్ టీవీ నటిగా కెరియర్ ప్రారంభించి, ప్రస్తుతం భోజ్‌పురిలో విజయవంతమైన నటిగా కొనసాగుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: