తమిళ నటి సంధ్యను ఆమె భర్త, దర్శకుడు బాలకృష్ణన్ ఇటీవల కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. 18 యేళ్ళపాటు కాపురం చేసిన తర్వాత తన భర్త నుంచి విడాకులు కోరింది. ఇద్దరు పిల్లల భవిష్యత్ గురించి ఆలోచన చేయకుండా విడాకులు కోరడాన్ని జీర్ణించుకోలేని ఆమె భర్త, తమిళ సినీ దర్శకుడు బాలకృష్ణన్ తన ఇంట్లోనే దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఒక్కే ముక్కను ఒక్కో ప్రాంతంలో ఉన్న చెత్తతొట్టిల్లో పడేశారు.
కాగా, పెరుంగుడి డంపింగ్ యార్డ్లో జనవరి 21న నుంగంబాక్కం జోన్ నుంచి సేకరించిన చెత్తకుప్పలో లభించిన అవయావాల ఆధారంగా విచారణ జరిపారు పోలీసులు. ఈ దర్యాప్తులో భాగంగా, చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా హత్యకు గురైంది సహాయ నటి సంధ్యగా గుర్తించారు. పోలీసులు అవి సినీ సహాయనటివని గుర్తించి, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు సంధ్య కాళ్లు, చేతులు, మొండెం దొరికినా ఇంకా తల లభించలేదు. దానికోసం పలు చోట్ల గాలిస్తున్నారు.
హత్య జరిగి వారం రోజులు కావొస్తున్న నటి సంద్య తల మాత్రం దొరకలేదని పోలీసులు తెలిపారు. దాంతో లై డిటెక్టర్ సాయంతో బాలకృష్ణన్ను విచారించి సంధ్య తలను విసిరేసిన ప్రాంతాన్ని కనుగొనాలని భావిస్తున్నారు. లైడిటెక్టర్ పరీక్షల్లో సంధ్య హత్యకు బాలకృష్ణన్కు సాయపడినవారి వివరాలు కూడా తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.
మొత్తానికి తమిళ చిత్ర పరిశ్రమలో ఈ కృరమైన హత్య గురించి రక రకాలుగా చర్చలు నడుస్తున్నాయి. నటి సంధ్య హత్యను ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్ సినిమా రూపొందించేందుకు దర్శకుడు బాలకృష్ణన్ నిర్ణయించినట్లు సినీవర్గాలలో టాక్ వచ్చింది. ఇటీవల బాలకృష్ణన్ తెరకెక్కించిన ‘కాదల్ ఇలవశం’ సినిమా పరాజయం పొందడంతో ఆయన తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అంతేకాకుండా ఈ ఘటనను ఇతివృత్తంగా తీసుకుని ఓ థ్రిల్లర్ సినిమాను తీసేందుకు బాలకృష్ణన్ సిద్ధమయ్యాడని పేర్కొన్నారు.