ఈ రోజు రాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ కొంత మంది గుండెల్లో రైళ్లు పరిగెడిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా లో చంద్ర బాబు ను విలన్ గా చూపించాడని క్లియర్ గా తెలిసి పోతుంది. టీడీపీ పార్టీ కి ఎన్నికల ముందు ఈ సినిమా ఇబ్బంది కలిగించేది. తాజాగా, వర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అదీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' వ్యతిరేకులకు హెచ్చరికలు చేస్తూ. రేప్పొద్దున్నే ట్రైలర్ వచ్చేస్తోందనీ, తనను వ్యతిరేకించేవారూ, స్వర్గీయ ఎన్టీఆర్ వెన్నుపోటుదారులకు మద్దతునిచ్చేవారూ జాగ్రత్తగా వుండాలనీ, ఉదయాన్నే లేచి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసుకోవాలనీ పేర్కొన్నారు రామ్గోపాల్ వర్మ.
ప్రస్తుత రాజకీయాల్ని పరిగణనలోకి తీసుకుని, నిన్ననే వర్మ ఓ పోల్ కూడా నిర్వహించాడు.. చంద్రబాబు పార్టీలు మార్చడం గురించీ, వెన్నుపోటు పొడవడం గురించీ. 85శాతం మంది వర్మతో ఏకీభవించారట.. ఆ విషయాన్నీ వర్మ ప్రత్యేకంగా ఇంకో పోస్ట్లో పేర్కొన్నాడండోయ్. 'వెన్నుపోటు' నిజం. దానికి 'నాయకత్వ మార్పిడి' అంటూ పాలిష్డ్ పేరుని చంద్రబాబు పెట్టిన మాటా వాస్తవం. స్వర్గీయ ఎన్టీఆర్ని తప్పించి, తెలుగుదేశం పార్టీ పగ్గాల్ని చంద్రబాబు దక్కించుకున్న క్రమంలో తెరవెనుక ఏమేం జరిగాయో తెలుగు ప్రజలందరికీ తెలుసు.
కానీ, మీడియాని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఏం చేయాలో అంతా చేసేశారు. మళ్ళీ ఆనాటి ఆ ఘోరాన్ని ఇప్పుడు వర్మ వెండితెరపై చూపించనున్న దరిమిలా.. సినిమాపై ఆసక్తి ఏర్పడడం సహజమే. అయితే, వర్మ ఎంతవరకు ఈ విషయంలో సక్సెస్ అవుతాడన్నదీ ఆలోచించాల్సిన విషయమే. రేప్పొద్దున్న ట్రైలర్ మాత్రమే విడుదలవుతుంది.. అదిచాలు చంద్రబాబు అండ్ టీమ్కి వెన్నులో వణుకు పుట్టడానికన్నది మెజార్టీ అభిప్రాయం.