ఈ నెల 22న ‘మహానాయకుడు’ విడుదల ఖరారు కావడంతో పాటు ఈసినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా కొలిక్కివచ్చిన నేపధ్యంలో ఈమూవీ ప్రమోషన్ ఈవీక్ ఎండ్ నుంచి ప్రారంభంకాబోతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ‘కథానాయకుడు’  ప్రదర్శించిన థియేటర్స్ లోనే ‘మహానాయకుడు’ సందడి చేయబోతున్నాడు. 
Mithai Telugu Movie Opening Pics, 2018, Telugu Movie, Priyadarshi Pullikonda, vijay deverakonda
సంక్రాంతి బరిలో ‘కథానాయకుడు’ మూవీ భారీ సినిమాలతో పోటీ పడవలసి రావడం వల్ల ‘కథానాయకుడు’ మూవీకి ప్రశంసలు లభించినా  ఆశించిన స్థాయికన్నా అతి తక్కువ కలెక్షన్స్ రావడం బాలకృష్ణకు తీవ్ర అవమానంగా మారింది. దీనితో కనీసం ‘మహానాయకుడు’ ని అయినా హిట్ చేయాలని ఈమూవీకి ఎన్నో రిపైర్లు చేసి అనేక ఆలోచనలు చేసి ఎట్టకేలకు ఈసినిమాను రిలీజ్ చేస్తూ ఎటువంటి పోటీ లేకుండా చూడాలని ప్రయత్నించినా చాపకింద నీరులా ‘మహానాయకుడు’ కి పోటీ ఇప్పుడు కూడా తప్పడం లేదు. 
Mithai Telugu Movie
‘పెళ్లి చూపులు’ ‘అర్జున్ రెడ్డి’ లతో పాపులారిటీ తెచ్చుకున్న ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ నటించిన ‘మిఠాయి’ మూవీ ‘మహానాయకుడు’ ని  లెక్కచేయకుండా వచ్చేవారం విడుదలకాబోతు ఉండటం సంచలనంగా మారింది. ఈమూవీ పై అర్బన్ యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. డిఫరెంట్ థీమ్ తో రూపొందిన దీని ట్రైలర్ కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. 
Mithai Movie Teasers
ఇది చాలదు అన్నట్లుగా గతఏడాది తమిళంలో విడుదలైన మంచి హిట్ కొట్టిన క్రైం థ్రిల్లర్ ‘నోడిగల్’మూవీని ‘అంజలి సీబీఐ’ పేరుతో 22న రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న నయనతార ది లీడ్ రోల్. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి క్యామియో మరోప్రధాన ఆకర్షణ. సైకో కిల్లర్ గా అనురాగ్ కశ్యప్ ప్రశంసలు అందుకున్నాడు. వాస్తవానికి ఈ రెండు సినిమాలు  ‘మహానాయకుడు’ రేంజ్ వి కాకపోయినా ఈరెండు సినిమాలలో ఏదో ఒక్కటి హిట్ అయి ‘మహానాయకుడు’ ఫెయిల్ అయితే ఆ పారభవం బాలయ్య తట్టుకోగలడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..  
.


మరింత సమాచారం తెలుసుకోండి: