సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కి సంబంధించి ట్రైలర్  కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేశారు.  ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు ఎన్టీఆర్ కళ్లముందు ఉన్నట్టు అనిపిస్తుంది.  1989 తర్వాత రాజకీయాల్లో ఎన్టీఆర్ పడ్డ కష్టాలు, కన్నీళ్లు చూపించారు.  ఆయన నమ్ముకున్న వారు ఎలా వెన్ను పోటు పొడిచారో స్పష్టంగా చూపిస్తున్నారు. 


తన కుటుంబ సభ్యులతో మీరు నా పిల్లలు అయి ఉండా ఆ నీచుడితో కలుస్తారా అనడం..చివరగా నా మొత్తం జీవితంలో నే చేసిన ఒకే ఒక తప్పుడు వాడిని నమ్మడం..అంటూ కన్నీరు పెట్టుకోవడం చూస్తుంటే..ఎన్టీఆర్ చివరి దశలో ఎన్ని బాధలు అనుభవించారో చూపిస్తున్నారు. తాజాగా తన చిత్రాన్ని స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు ఆశీర్వదించేశారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.  


తాను నిర్మించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ట్రయిలర్ ను ఆయన విడుదల చేయగా, గంట వ్యవధిలో 5.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. , "వావ్... గంటలో 5.5 లక్షల వ్యూస్. దేవుడు ఎన్టీఆర్ ఆశీర్వదించారు" అని కామెంట్ పెట్టారు. ఈ వార్త రాసే సమయానికి 6.45 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ ట్రయిలర్ వ్యూస్ మిలియన్ మార్క్ ను తాకడానికి మరెంతో సమయం పట్టేలా లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: