సిల్వర్ స్క్రీన్ పై ప్రేమించుకున్న హీరో, హీరోయిన్లు రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడటం..పెద్దల అంగీకారంతో ఒక్కటి కావడం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న నటులు ఉన్నారు. ప్రముఖ తమిళ నటుడు ఆర్య, సినీ నటి సాయేషా సైగల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రియాంక చోప్రా, నిక్ జోనస్, రణ్వీర్, దీపికాలు వారి ప్రేమాయాణాన్ని పెళ్లి అనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
సౌత్ విషయానికొస్తే...చాలా మంది హీరో, హీరోయిన్లు వాళ్ల రీల్ లైప్ ప్రేమను రియల్ లైఫ్లో కంటిన్యూ చేసి ఒక్కటయ్యారు. ఇటీవల నాగ చైతన్య, సమంతలు వారి ప్రేమ బంధాన్ని పెళ్లితో ముడివేసుకున్నారు. విలక్షమైన పాత్రలను చేస్తూ తమిళనాట తన ప్రత్యేకతను చాటుకున్న ఆర్య...గ్లామరస్ కథానాయికగా గుర్తింపు పొందిన సాయేషా మధ్య సాగిన ప్రేమ కథ పెళ్లిదాక వెళ్లిందట. వచ్చేనెలలో వీరి వివాహాన్ని జరిపించడానికి రంగం సిద్ధమైందని సమాచారం. పెళ్లి ఏర్పాట్లలోనే కుటుంబ సభ్యులు బిజీగా వున్నట్టుగా తెలుస్తోంది.
ఈ విషయాన్ని ప్రేమికుల రోజు సాక్షిగా ఆర్య ట్విట్టర్ వేదికగా అఫీషియల్గా ప్రకటించారు. దీంతో సూర్య, మోహన్ లాల్ పలువురు ప్రముఖులు వీళ్లకు అభినందలు తెలియజేశారు. 2018లో ‘గజినీకాంత్’ అనే తమిళ సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. అప్పటి నుంచి వీళ్లిద్దరికీ ఒకరిపై ఇంకొకరికీ ప్రేమ కలిగింది. ప్రస్తుతం వీళ్లిద్దరు కే.వి.ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తోన్న ‘కప్పం’ సినిమాలో మరోసారి జంటగా నటిస్తున్నారు.
సాయేషా తెలుగుతో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. వచ్చే నెలలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అందుకు మీ ఆశీస్సులు కావాలి అంటూ ఓ ట్వీట్ చేసింది సాయేషా.. ఇంకేముంది పెద్ద ఎత్తున ఈ జంటని ఆశీర్వదిస్తున్నారు