సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటి సమస్యను మహేష్ బావ సుధీర్ బాబు పరిష్కరించాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే మహేష్ తన సొంత ప్రొడక్షన్ లో ఒక వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్న విషయం తెల్సిందే. నమ్రత నిర్మాణ కార్యక్రమాలు చూడబోతున్న ఈ వెబ్ సిరీస్ కు 'చార్లీ' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.
‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి రచయితగా వ్యవహరించిన హుస్సేన్ షా కిరణ్ ఈవెబ్ సిరీస్ కు దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడు. 8 ఎపిసోడ్స్ గా ఈవెబ్ సిరీస్ నిర్మాణం జరుపుకొబోతోంది. మొదట్లో ఈవెబ్ సిరీస్ లో మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ కాని లేదేంటే మహేష్ అన్నయ్య కొడుకు జయకృష్ణ కాని నటిస్తారు అన్న వార్తలు వచ్చాయి.
దీనితో మహేష్ బాబు ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరోను 'చార్లీ' వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో చూడ బోతున్నట్లు అభిమానులకు సంకేతాలు వచ్చాయి. దీనితో మహేష్ బాబు ఫ్యామిలీ నుండి ఎవరు రాబోతున్నారా అంటూ అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్న పరిస్థితులలో ఎవరు ఊహించని విధంగా అందరికి షాక్ ఇస్తూ సుధీర్ బాబు పేరు బయటకు తీసుకు వచ్చి 'ఛార్లీ' గా సుధీర్ ఎంపిక ఫైనల్ చేసాడు.
ఈ నిర్ణయం ఇలా తీసుకోవడానికి వేరే కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. మహేష్ నిర్మాణంలో మొదటిగా వస్తున్న వెబ్ సిరీస్ కావడం దీనికితోడు ఈ ఛార్లీ పాత్రకు నటన రీత్యా చాల ప్రాధాన్యత ఉండటంతో అనుభవం లేని యంగ్ హీరోల కంటే అనుభవం ఉన్న హీరో ఈ వెబ్ సిరీస్ లో నటిస్తే ఈ ప్రయత్నం విజయవంతం అవుతుంది అన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనితో ఈమధ్య వరస పరాజయాలతో సతమతమవుతున్న సుధీర్ బాబుకు మహేష్ ఊహించని సపోర్ట్ ఇచ్చాడు అనుకోవాలి..