సరిగ్గా ఎన్నికలకు ముందు విడుదలవుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా టీడీపీకి చిక్కులు తెచ్చేలా ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన ద్రోహమే ప్రధానాంశంగా ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది.



చంద్రబాబే నూటికి నూరు శాతం టార్గెట్ గా ఈ సినిమా వస్తుందన్నది ట్రైలర్ తోనే అర్థమైపోతోంది. అయితే ఈ సినిమా వెనుక ఉన్నది ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి. వైసీపీ పార్టీకి చెందిన వారే అన్నది ఇప్పటికే తెలిసిన విషయం.



కానీ ఈ రాకేశ్ రెడ్డి జగన్ కు చాలా సన్నిహితుడని.. ఎంత సన్నిహితుడంటే విమానంలో పక్కపక్క సీట్లలో కూర్చుని వెళ్లేంత స్నేహం ఉందని ఇప్పుడు ఓ ఫోటో చెబుతోంది. ఆ పోటోను ఏకంగా ఈ సినిమా దర్శకుడు వర్మే బయటపెట్టడం విశేషం. రాకేశ్ రెడ్డి, జగన్ తో ఉన్న ఫోటోను వర్మ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.




వర్మ ఇప్పుడు ఈ పోటో బయటపెట్టడం వెనుక ఉద్దేశం ఏంటన్నది అర్థం కాని విషయం. ఈ సినిమా వెనుక ఉన్నది జగనే అని వర్మ పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నట్టే కనిపిస్తోంది. వివాదం ఉంటేనే సినిమాకు పాపులారిటీ వస్తుందని నమ్మే వర్మ.. రాకేశ్ రెడ్డి, జగన్ స్నేహాన్ని కూడా తన పబ్లిసిటీకి వాడుకుంటున్నట్టు కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: