స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. అయితే ఇంకా మొదలు పెట్టని ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దెని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ బన్నితో దువ్వాడ జగన్నాధం సినిమాలో జతకట్టిన పూజా మళ్లీ రెండోసారి కలిసి చేస్తుంది.


హీరోయిన్ విషయంలో అల్లు అర్జున్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ డీజే టైంలోనే బన్ని, పూజా చాలా క్లోజ్ అవగా ఆ సినిమా తర్వాత పూజాకి లక్కీ ఆఫర్స్ వచ్చాయి. వరుసగా స్టార్స్ తో నటిస్తున్న పూజా హెగ్దె లాస్ట్ ఇయర్ అరవింద సమేతలో కూడా నటించి మెప్పించింది.


ప్రస్తుతం మహేష్ మహర్షి, ప్రభాస్ జాన్ సినిమాల్లో నటిస్తున్న పూజా హెగ్దె మరోసారి బన్నితో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతుంది. త్రివిక్రం, బన్ని కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా ఇది వస్తుంది. ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు హిట్ అవడంతో ఈ హ్యాట్రిక్ మూవీపై అంచనాలు పెరిగాయి.


ఈ సినిమా కూడా తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో వస్తుందని తెలుస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా ఈ ప్రాజెక్ట్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ కూడా నిర్మాణ భాగస్వామ్యం అవుతుంది. బన్ని, త్రివిక్రం ముచ్చటగా మూడవసారి కలిసి చేసే ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: