టాలీవుడ్ లో ఇప్పటి వరకు మెగా హీరోలు తమ సత్తా చాటుతు మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.  మొదటి సారిగా మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ‘ఒక మనసు’తో మూవీతో వెండితెరకు పరిచయం అయ్యింది.  వాస్తవానికి నిహారిక బుల్లితెరపై వచ్చే ఢీ కార్యక్రమంలో యాంకర్ గా చేసి తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేసి, నటించింది.  అయితే నాగశౌర్య హీరోగా ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన నిహారిక మంచి సక్సెస్ అందుకోలేక పోయింది. 

Image result for rangasthalam
ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా పెద్దా హిట్ కాలేదు.  కాకపోతే నిహారిక నటించిన తమిళంలో నటించిన సినిమా మాత్రం మంచి సక్సెస్ అయ్యింది.  ఇక ‘రంగస్థలం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినప్పటికీ తరువాత సినిమా కోసం దర్శకుడు సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సుక్కు సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమై పోయారని కానీ సరైన స్క్రిప్ట్ తో రమ్మనడంతో మరికొంత సమయం పడుతుందని చెప్పండంతో మహేష్ సుక్కు సైడ్ అయిపోయి అనిల్ రావిపూడికి దారిచ్చారంటూ మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
Image result for sukumar mahesh
మహేశ్‌తో సినిమా మాటెలా ఉన్నా.. ఆమధ్య ‘సుకుమార్ రైటర్స్’ అనే సంస్థను స్థాపించిన సుక్కు ప్రస్తుతం చిత్ర నిర్మాణంలో బిజీ అయిపోయాడు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి రెండు సినిమాలను నిర్మిస్తున్న సుక్కు.. నాగబాబు కూతురు నిహారిక కొణిదెలతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: