అల్లు శిరీష్ హీరోగా  పెద్దగా రాణించలేక పోయినా సినిమా ఫంక్షన్స్ కు వ్యాఖ్యాతగా రాణించాడు. దీనితో ఇతడి పేరు సినిమాలలో కంటే సినిమా ఫంక్షన్స్ లోనే బాగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో శిరీష్ సోషల్ మీడియాలో వేసిన ఒక జోక్ మరీ మితిమీరి ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 
Allu Sirish
లేటెస్ట్ గా శిరీష్  తాను  'కాఫీ విత్ కిషోర్' అనే బుల్లితెర కార్యక్రమానికి అతిధి గా వెళుతున్నాను అంటూ ట్విట్ చేసి చాలామందికి షాక్ ఇచ్చాడు.  అంతేకాదు "నేను ఎగ్జైటెడ్ గా నెర్వస్ గా ఉన్నా.. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన.. టాప్ రేటెడ్ టాక్ షో కు నన్ను అతిథిగా పిలిచారు"  అంటూ ట్వీట్ చేసి చాలామందిని మరింత గందర గోళంలో పడేసాడు.  

దీనితో ఇలాంటి షో ఏ ఛానెల్ నిర్వహిస్తోంది అంటూ చాలామంది ఈ కార్యక్రమ వివరాలు తెలుసుకుందామని గూగుల్ లో  తెగ సెర్చ్ చేశారు. అయితే అల్లుశిరీష్ ఈ ట్విట్ చేసిన  మూడు గంటల తర్వాత మరో ట్వీట్ చేస్తూ "ఫైనల్ గా #కాఫీ విత్ కిషోర్ షో కు వచ్చాను. ఆయన ప్రశ్నలతో మమ్మల్ని గ్రిల్ చేశారు. కానీ నేను.. లొంగ లేదు. ఈ ప్రోగ్రాం మార్చ్ లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది." అని క్లారిటీ ఇచ్చాడు. 
Image may contain: one or more people, close-up and indoor
దీనితో శిరీష్ ఈ వ్యహారం అంతా  తన కొత్త సినిమా 'ఎబీసిడీ' సినిమా కోసం చేసిన పబ్లిసిటీ  స్టంట్ అని తేలడంతో కొందరు శిరీష్ జోక్ ను ఎంజాయ్ చేస్తే  మరికొందరు ఈ జోక్ పై తమ అసహననాన్ని వ్యక్త పరిచారు. ఈ మూవీ కూడా కనీస విజయాన్ని అందుకోలేక పోతే శిరీష్ తో సినిమాలు చేసే వారు భవిష్యత్ లో ఎవరు ముందుకు రాక పోవచ్చు..



మరింత సమాచారం తెలుసుకోండి: