గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే అందమొకటే కాదు, మిగిలినవన్నీ కూడా సరిపోవాలి. అలా దిగివచ్చి ఇలా స్టార్ హీరోయిన్లు అయిన వారు ఎందరో టాలీవుడ్లో కనిపిస్తారు. మరో వైపు అందం, అభినయం కలబోసి ఉన్న వారు సైతం చాన్సులు లేక చుక్కలు లెక్కబెడుతూంటారు. అసలు సినిమా లోకమే ఓ మాయాజాలం, ఇక్కడ ఎవరు ఎవరినీ నమ్మరంటారు.


ఇక గ్లామర్ డాల్ కియరా అద్వానీ సంగతే తీసుకుంటే ఈ సంక్రాంతి వరకూ ఓ వెలుగు వెలిగింది. వినయ విధేయ రామప్రి రిలీజ్  ఫంక్షన్లో కియారా జోరు చూసి టాలీవుడ్ లేడీ  సూపర్ స్టార్  అనుకున్నారంతా. అయితే ఆ మూవీ డిజాస్టర్ కావడంతో కియారా చేతిలో ఉన్న రెండు బంగారు లాంటి అవకాశాలు జారిపోయాయట. అందుకో ఒకటి అల్లు అర్జున్ త్రివిక్రం కాంబోలో తెరకెక్కుతున్న కొత్త మూవీ అంటున్నారు. నిజానికి ఈ మూవీలో కియారా హీరోయిన్ అని ఇప్పటివరకూ అనుకున్నారు. అయితే లేటెస్ట్ డిజాస్టర్ ని ఉంచుకుని ఆమెను తీసుకుంటే అప శకునం అని భావించారో ఏమో కానీ వద్దు అనేసుకున్నారట. 


దాంతో కియారా ప్లేస్ లోకి పూజా హెగ్డే వచ్చేసింది. ఈ భామ లేటెస్ట్ హిట్ అరవింద సమేత ఉంది. అది కూడా త్రివిక్రం డైరెక్షన్లో రావడం, బన్నీ మూవీకి కూడా అయనే డైరెక్టర్ కావడంతో పూజకు అలా  కలసి వచ్చింది. మరి కియారా కు మాత్రం టాలీవుడ్లో ఇపుడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదుట. దాంతో ఆమె అర్జున్ రెడ్డి హిందీ మూవీలో బిజీ అవుతోంది. అక్కడ హిట్ కొడితే మళ్ళీ ఇటు వైపు ఎవరైన పిలుస్తారో ఏమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: