బెల్లంకొండ శ్రీనివాస్‌ను ఇప్పటిదాకా ఐదు సినిమాలు చేసినా వాటిలో చెప్పుకో దగ్గ హిట్ ఒక్కటి కూడ లేదు. కానీ అతడి ప్రతి సినిమాలో భారీ తారాగణం ఉంటుంది. భారీ బడ్జెట్లు పెడుతుంటారు. సినిమా ఫెయిలైనా ఎవరిలో ఏఆందోళన కనిపించదు. అతడి నిర్మాతలు ఎవరు ఎప్పుడు టెన్షన్ పడకపోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉండటం కాకుండా ఈవ్యహారం వెనుక బ్యాకప్ అతడి తండ్రి బెల్లంకొండ సురేషే అని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.   

ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈ యంగ్ హీరో నటించే ప్రతి సినిమాకు నిర్మాతగా పేరు పడే వ్యక్తి నామమాత్రంగా పెట్టుబడి పెడితే మిగతా పెట్టుబడి అంతా సురేషే చూసుకుంటాడు అనే కామెంట్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ వర్గాల అంచనాలప్రకారం సురేశ్ తన కొడుకు మీద ఇప్పటివరకు 50 కోట్ల వరకు నష్టపోయి ఉంటాడు అనే అంచనాలు కూడ ఉన్నాయి. 
Image may contain: 1 person, smiling, beard
ఇలాంటి పరిస్థితులలో ఈయంగ్ హీరో లేటెస్ట్ గా అంగీకరించిన ఒక మూవీ మెగా కాంపౌండ్ కు కోపం తెప్పించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు బెల్లంకొండ రమేశ్ వర్మ అనే దర్శక నిర్మాత తీయబోతున్న సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈమూవీ కోలీవుడ్ లో హిట్ అయిన ఒక మూవీకి రీమేక్ అని తెలుస్తోంది. విష్ణు విషాల్ అమలా పాల్ నటించిన ఈమూవీ కోలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. 
Image may contain: 1 person, smiling, beard
ఈమూవీ పై మెగా కాంపౌండ్ దృష్టి పడటంతో మెగా కాంపౌండ్ కు చెందిన ఇద్దరు యాంగ్ హీరోలు ఈమూవీని దర్శకుడు మారుతి చేత రీమేక్ చేయిద్దామని ప్రయత్నాలు చేసారు. అయితే వారి ప్రయత్నాలు కొనసాగుతూ ఉండగానే ఈమూవీని నిర్మిస్తున్న నిర్మాత భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి ఈమూవీ రీమేక్ రైట్స్ తాను తెచ్చుకుని బెల్లంకొండ శ్రీనుతో నిర్మిస్తూ ఉండటం మెగా కాంపౌండ్ యంగ్ హీరోలకు ఊహించని షాక్ మాత్రమే కాకుండా బయటకు చెప్పుకోలేని అసహనాన్ని కలిగించింది అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: