పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతటా విషాదం నెలకొంది. వీర సైనికులకు మద్దతుగా దేశమంతటా ప్రదర్శనలు జరుగుతున్నాయి. సెలబ్రెటీలు తమ సంతాపాన్ని.. ఐక్యతను సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. ఈ సమయంలో రజీనీకాంత్ కుమార్తె ఐశ్వర్య పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలపై అంతా మండిపడుతున్నారు.

సంబంధిత చిత్రం


రజినీకాంత్ కుమార్తె సౌందర్య ఇటీవలే విశాఖన్ ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళ సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. కొత్త జంట హానీమూన్ కోసం ఐస్ ల్యాండ్ కు వెళ్లింది. అక్కడ వారు ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సౌందర్య.

soundarya rajinikanth HONEYMOON కోసం చిత్ర ఫలితం


పాపం.. వాళ్లకు అవి అపురూప క్షణాలే కావచ్చు. కానీ పోస్ట్ చేసిన టైమింగ్ కరెక్ట్ కాదు.. కదా.. దేశమంతా అమరవీరులకు నివాళులు అర్పిస్తున్న సమయంలో హానీమూన్ ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చేసరికి చాలా మంది వారిని తప్పుబడుతున్నారు. సోషల్ మీడియాలో కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత చిత్రం


ఈ సమయంలో మీరు హనీమూన్ చేసుకోవడం అది మీ వ్యక్తిగతం కాని ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో పెట్టడం ఏంటీ అంటూ కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. మీ మైండ్ ఏమైనా చెడిందా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పుడు టైమింగ్ చాలా ముఖ్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: