నిన్న సాయంత్రం విశాఖపట్నంలో అత్యంత ఘనంగా జరిగిన టిఎస్ఆర్ అవార్డ్స్ ఫంక్షన్ టాలీవుడ్ టాప్ హీరోల కలయికకు వేదిక అయింది. చాల కాలం తరువాత ఒకే వేదిక పై చిరంజీవి బాలకృష్ణ నాగార్జున మోహన్ బాబుల కలయిక జరగడంతో వారంతా తమ చిన్నచిన్న భేదాభిప్రాయాలను పక్కకు పెట్టి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం నిన్నటి ఫంక్షన్ హైలెట్.
సుబ్బిరామిరెడ్డి గురించి...
ఈ సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ ఈ ఫంక్షన్ కు వచ్చిన బాలకృష్ణకు అవార్డ్ వచ్చింది అదేవిధంగా నాగార్జునకు అవార్డ్ వచ్చింది మోహన్ బాబుకు కూడ అవార్డ్ వచ్చింది కానీ తనకు మాత్రమే అవార్డ్ రాలేదు అంటూ జోక్ చేసాడు. అయితే తాను చరణ్ కు వచ్చిన అవార్డ్ ను తీసుకోవడానికి అతడి తరఫున వచ్చాను అంటూ ఇలా అవార్డ్ లు వచ్చిన టాప్ హీరోలను చూస్తే ఈర్ష్యగా ఉంది అంటూ సెటైర్ వేసాడు.
అభిమానుల్లో కూడా..
అయితే ఈ జోక్ కు స్పందించిన మోహన్ బాబు వెంటనే మైక్ దగ్గరకు వచ్చి తనకు వచ్చిన అవార్డ్ ను చిరంజీవికి ఇచ్చేస్తున్నాను అని మరొక జోక్ వేయగానే ఈ ఫంక్షన్ కు వచ్చిన వేలాదిమంది చప్పట్లు ఈలలతో ఈ కార్యక్రమానికి మరింత జోష్ ను ఇచ్చారు. ఇక ఈ ఫంక్షన్ లో మాట్లాడిన చిరంజీవి మరొక ట్విస్ట్ ఇస్తూ తమ టాప్ హీరోల మధ్య ఏవో భేదాభిప్రాయాలు ఉన్నాయి అంటూ తరుచూ వార్తలు వస్తుంటాయని అలాంటి భేదాభిప్రాయాలు ఉంటే తామంతా కలిసి ఇలా అవార్డ్ ఫంక్షన్ కు వస్తామా అంటూ బాలకృష్ణ వంక నవ్వుతు చూసిన విషయం మీడియా కెమెరాలకు హాట్ న్యూస్ గా మారింది.
పుత్రోత్సాహాన్ని ఆస్వాదిస్తున్నాను
ఇక ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సుబ్బిరామిరెడ్డి శక్తి గురించి చిరంజీవి మాట్లాడుతూ ఇలాంటి శక్తి ఉత్సాహం సుబ్బిరామిరెడ్డికి ఈ వయస్సులో కూడ ఎలా వస్తుందో తనకు అర్ధం కాదు అంటూ తాను బాలకృష్ణ నాగార్జున ఇలా అంతా కలిసి ఈ ఫంక్షన్ కు వచ్చింది మొక్కుబడి కోసం కాదనీ తమకు సుబ్బిరామిరెడ్డి పై ఉన్న అభిమానాన్ని వ్యక్తపరచడానికి అంటూ తన ప్రశంసలు కొనసాగించాడు. సాధారణంగా చిరంజీవి నాగార్జున బాలకృష్ణ ఒకే సినిమా ఫంక్షన్ కు వచ్చిన సందర్భాలు గత కొంతకాలంగా ఏమీ లేవు. దీనితో వీరి ముగ్గురుని మళ్ళీ కలిపిన సుబ్బిరామి రెడ్డి ఉత్సాహం చూస్తుంటే రానున్న రోజులలో చిరంజీవి పవన్ లతో నిజంగానే ఒక మల్టీ స్టారర్ మూవీ సుబ్బిరామిరెడ్డి తీసినా ఆశ్చర్యం లేదు అంటూ ఈ ఫంక్షన్ కు వచ్చిన అనేకమంది అతిధులు కామెంట్స్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: