తెలుగు ఇండస్ట్రీలో విజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటించిన ‘ఆర్ ఎక్స్ 100’చిత్రంలో హీరోయిన్ గా నటించిన బోజ్ పూర్ సుందరి పాయల్ రాజ్ పూత్ యూత్ లో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఘాటు ముద్దులు..బెడ్ రూమ్ సీన్లలో బోల్డ్ గా కనిపించిన పాయల్ కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఈ చిత్రం తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఇక సోషల్ మీడియాలో ఘాటు ఫోటో షూట్లతో నెటిజనులపై విరుచుకుపడుతోంది.
ఈ భామ మిస్సా మోర్ క్లోతింగ్ కు బ్రాండ్ అంబాజిడర్. ఈ బ్రాండ్ దుస్తులకు పాయల్ హాట్ హాట్ గా ఫోటో షూట్స్ చేయడమే కాదు ఈ ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా లో అప్లోడ్ చేసిపారేసింది. అందమైన మెరూన్ కలర్ టాప్.. జీన్స్ స్కర్ట్ తో సూపర్ డూపర్ పోజులు ఇచ్చింది. లైట్ పింక్ కలర్ లిప్ స్టిక్.. లూజ్ గా వదిలేసిన బ్రౌన్ కలర్ హెయిర్.
వేలికి రింగులు తప్ప మరే ఇతర యాక్సెసరీస్ లేకుండా దర్శనమిచ్చింది. ఈ హాట్ బ్యూటీ క్లీవేజ్ కి మరోసారి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం పాయల్ కి 'వెంకీమామ' లో వెంకటేష్ సరసన హీరోయిన్ గా.. 'మన్మధుడు-2' నాగార్జునకు జోడీగా నటించే అవకాశాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తమిళంలో 'ఏంజెల్' అనే చిత్రంలో చేస్తోంది.