తెలుగు ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు గోపిచంద్. లౌక్యం చిత్రం తర్వాత గోపిచంద్ నటిస్తున్న చిత్రాలు వరుసగా ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం తిరు దర్శకత్వంలో అనిల్ సుంకర్ నిర్మిస్తోన్న ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జైపూర్ సమీపంలోని మాండవ వద్ద చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈ రోజు ఉదయం షూటింగ్లో భాగంగా బైక్ ఛేజింగ్ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో గోపిచంద్ బైక్ స్కిడ్ కావడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.
వెంటనే తేరుకున్న చిత్ర యూనిట్ గోపిచంద్కు అక్కడి ఫోర్టిస్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు.