తెలుగు బుల్లితెరపై తన హాట్ లుక్ తో కుర్రాళ్లకు మతులు పోగొట్టిన యాంకర్ అనసూయ ప్రస్తుతం వివిధ ఛానల్స్ లో యాంకర్ గా బిజీగా ఉన్నారు.  అంతే కాదు ఇటీవల విడుదలైన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా నటించి మంచి పేరు తెచ్చుకుంది.  ఈ చిత్రం తర్వాత అనసూయ కు వరుసగా సినీ ఛాన్సులు వస్తున్నాయి. ఈ నెల రిలీజ్ అయిన ‘యాత్ర’చిత్రంలో కూడా అనసూయ నటించింది.  ఎప్పుడూ ట్విట్టర్, ఫేస్ బుక్ లో యాక్టీవ్ గా ఉండే అనసూయ అప్పుడప్పుడు నెటిజన్ల పై ఫైర్ అవడం చూస్తున్నాం. 
Image result for pulwama encounter
తాజాగా  అనసూయ కు కోపం వచ్చింది అంతే నెటిజన్ల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అయితే అనసూయ కు కోపం రావడానికి కారణం ఏంటి ? నెటిజన్లు అనసూయ ని ఏమన్నారు ? అసలు విషయం ఏంటంటే రెండు రోజుల క్రితం పుల్వామా లో 43 మంది భారత సైనికులు అమరులయ్యారు..దాంతో యావత్ భారత దేశంలో వారికి సంతాపాన్ని తెలుపుతూ..వారి త్యాగాలను కొనియాడుతున్నారు.  ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది హీరోలు, హీరోయిన్లు అమర జవాన్ల కుటుంబాలకు విరాళాలు కూడ ప్రకటిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో జాతి యావత్తు ఆ సంఘటనపై మండిపడుతుండగా అనసూయ దానికి సంబంధించి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు సరికదా..కాస్త ఎక్స్ పోజింగ్ చేస్తూ ఫోటో షూట్ చేసింది.  ఆ ఫోటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అంతే నెటిజన్లకు ఎక్కడో కాలింది..ఇంకేముంది అనసూయ ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. దానికి అనసూయ కౌంటర్ ఇస్తూ..పుల్వామా సంఘటనకు నా ట్వీట్ లకు సంబంధం ఏముంది ? అది జరిగింది కదా అని స్నానం చేయడం మానేసారా ? తినడం మానేసారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ పని మీరు చూసుకోండ్రా అంటోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: