జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన నేపధ్యంలో దేశ ప్రజలు పాకిస్తాన్ పై తమ నిరసనను అదేవిధంగా తమ కోపాన్ని ఇప్పటికీ వ్యక్త పరుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఈ ఆగ్రహం ఘాటైన వ్యాఖ్యల రూపంలో కనిపిస్తోంది.
కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ
ఇలాంటి పరిస్థుతులలో నందమూరి సింహం బాలయ్య అభిమానులు మరొక అడుగు ముందుకు వేసి బాలకృష్ణ పేరుతో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను బాలయ్య పేరు చెప్పి భయపెట్టడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. పుల్వామా సంఘటనకు నిరసన తెలుపుతూ బాలయ్య అభిమానులు వినూత్నంగా స్పందించారు.
అలుపు లేకుండా నరుకుతాడట!
ఈ నేపధ్యంలో బాలయ్య వీరాభిమాని ఇమ్రాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రాం అకౌంట్ కామెంట్ సెక్షన్‌లో పెట్టిన పోస్ట్ చాలందిని ఆశ్చర్య పరుస్తోంది. ‘మీ దేశాన్ని ముగించడానికి బాలయ్య బాబు చాలు. బాంబులతో కాదు రా కంటి చూపుతో చంపేస్తాడు’. ఇలా పాక్‌ పై బాలయ్య అభిమాని తన కోపాన్ని బాలకృష్ణ డైలాగ్ రూపంలో వ్యక్త పరచడం హాట్ టాపిక్ గా మారింది.
Haven’t decided on the director but will announce in a few days: Nandamuri Balakrishna about biopic of N.T. Rama Rao
ఇదే సందర్భంలో మరో బాలకృష్ణ అభిమాని వేరే విధంగా స్పందించాడు.  ‘ఫేస్‌ టూ ఫేస్ రా.. మా సోల్జర్స్ మార్చింగ్‌కే నీకు హార్ట్ అటాక్ వస్తది’ అని కామెంట్ చేశాడు. అంతేకాదు పాక్ డిఫెన్స్ బడ్జెట్ కంటే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మూవీ పార్కింగ్ కలెక్షన్స్ ఎక్కువ అంటూ మరికొందరు పాక్ నాయకులను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దేశ భక్తిని కలిగించే ఈ కామెంట్స్ లోని ఆంతర్యం అందరికీ అర్ధం అవుతున్నా ఈవిషయంలో కూడ టాప్ హీరోల అభిమానులు తమ హీరోలను హైలెట్ చేస్తూ పెడుతున్న ఈ కామెంట్స్ చూస్తే నిజంగానే యుద్ధం వస్తే మన హీరోల అభిమానులు ఇలా విచిత్రమైన కామెంట్స్ చాల పెట్టే ఆస్కారం ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: