ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనారోగ్యంతో కొంత మంది నటులు ఇతర విభాగాలకు చెందిన వారు అయితే..ఆత్మహత్యలు చేసుకొని తనువు చాలిస్తున్నవారు మరికొంత మంది ఉన్నారు. ఏది ఏమైనా వెండి తెర, బుల్లితెరపై వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో దుఖఃంలో మునిగిపోతుంది ఇండస్ట్రీ.
తాజాగా ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు డీఎస్ దీక్షితులు (63) మృతి చెందారు. కృష్ణవంశి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మురారి చిత్రంలో పూజారిగా ఆయన మంచి పేరు సంపాదించారు. ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం, అతడు తదితర చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషించారు.
కెరీర్ బిగినింగ్ లో రంగస్థల నటుడుగా ఉంటూనే అధ్యాపకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. జూలై 28, 1956లో జన్మించిన దీక్షితులు రంగస్థల కళలో తెలుగు, సంస్కృత భాషల్లో ఎంఏ డిగ్రీలు పొందారు. దీక్షితులు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.