గత కొంత కాలంగా రేణు దేశాయ్ ఫిలిం రీ ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలను రేణు దేశాయ్ స్పష్టంగా ఖండించకుండా సరైన పాత్ర కోసం ఎదురు చూస్తున్నాను అంటూ సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమధ్య కాలంలో రేణు దేశాయ్ మరొక పెళ్ళి చేసుకోబోతున్నట్లు ప్రకటించడంతో ఇక రేణు ఫిలిం రీ ఎంట్రీ ఇక లేనట్లే అనుకున్నారు అంతా. 
Image may contain: 1 person, smiling, close-up
అయితే అనూహ్యంగా రేణుదేశాయ్ ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోయే మూవీలో కీలక పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తున్న నేపథ్యంలో స్థూవర్ట్ పురం ప్రాంతానికి సంబంధించి ఒకప్పుడు పేరు మోసిన గజదొంగగా పేరు తెచ్చుకున్న టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో రేణుదేశాయ్ ఒక కీలక పాత్రను అంగీకరించినట్లు టాక్. 
Image may contain: 1 person, close-up
తెలుస్తున్న సమాచారం మేరకు బెల్లంకొండ శ్రీనివాస్ టైగర్ నాగేశ్వరావుగా కనిపించబోతున్న ఈమూవీలో టైగర్ నాగేశ్వరావు సోదరి పాత్రను రేణుదేశాయ్ చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. 'దోంగాట' సినిమాను తీసిన వంశీ కృష్ణ ఈమూవీకి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈమూవీ ప్రాజెక్ట్ లో రానా టైగర్ నాగేశ్వరావు పాత్రను పోషిస్తాడు అని వార్తలు వచ్చాయి. 
Image may contain: 1 person, close-up
అయితే ఆతరువాత జరిగిన పరిణామాల మధ్య ఈమూవీ ప్రాజెక్ట్ బెల్లంకొండ చేతికి వెళ్లడంతో ఈమూవీకి క్రేజ్ తీసుకు రావడానికి బెల్లంకొండ సురేష్ స్వయంగా రంగంలోకి దిగి రేణుదేశాయ్ ని ఒప్పించినట్లు టాక్. రాజకీయల బాట పట్టి పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అయితే గతంలో పవన్ ను పెళ్లి చేసుకుని ఆతరువాత విడిపోయి సినిమాలకు దూరంగా ఉంటున్న రేణుదేశాయ్ తిరిగి ఇలా యూటర్న్ తీసుకోవడం యాధృశ్చికం అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: