తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా రాణించి ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ చేస్తున్న నటి రాయ్ లక్ష్మి.  ఆ మద్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’చిత్రంలో ర‌త్తాలు ర‌త్తాలు అంటూ తెలుగు ప్రేక్షకుల‌ని ఓ ఊపు ఊపిన రాయ్ ల‌క్ష్మీ ప్ర‌స్తుతం కృష్ణ కిషోర్ దర్శకత్వంలో ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 
Image result for rai laxmi vere is venkatalaxmi
ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే సస్పెన్స్, థ్రిల్లింగ్, హర్రర్ నేపథ్యంలో కొనసాగుతున్నట్లనిపిస్తుంది. ఏబీటీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో ఈ సినిమాని నిర్మాత‌లు గురునాథ్ రెడ్డి, ఆనంద్ రెడ్డిలు నిర్మిస్తున్నారు.  ట్రైలర్ లో మొదట కామెడీతో మొదలు పెట్టి చివర్లో భయంకరమైన సన్నివేశాలు చూపించారు. 

ఇక టీజ‌ర్‌లో క‌న్నా ట్రైల‌ర్‌లో మాంచి మసాలా ద‌ట్టించి వ‌ద‌ల‌డంతో సినిమాపై ఓ రేంజ్ అంచ‌నాలు పెరిగాయి. 2 నిమిషాల 16 సెకనుల నిడివితో ఉన్న ట్రైలర్‌‌లో లక్షీరాయ్, పూజిత పొన్నాడలు పోటీపడి మరీ అందాలను ఒలకబోయ‌డం విశేషం. హ‌రి గౌర చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: