ఎం.ఎస్. ధోని బయోపిక్ తో బాలీవుడ్ ఫిలిం ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వాని అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది. ఈమె తెలుగులో నటించినవి కేవలం రెండు మాత్రమే  అయినా ఆమె రేంజ్ కోటి రూపాయల హీరోయిన్స్ లిస్టులో కొనసాగుతోంది. అయితే ఊహించని విధంగా ‘వినయ విధేయ రామ’ ఫ్లాప్ అవ్వడంతో ఆమె పని అయిపోయింది అంటూ వస్తున్న గాసిప్పుల పై ఈబ్యూటీ ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది.

తనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాల అవకాశాలు వస్తున్నాయని త్వరలోనే తాను ఒక టాప్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్న విషయాలను లీక్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి అని అంటోంది. ఇదే ఇంటర్వ్యూలో ఆమె మహేష్ రామ్ చరణ్ ల నేచర్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. 
Kiara Advani is the new sensation in Tollywood
సినిమాలకు సంబంధించి తనతో నటించేడప్పుడు ఎంతో రొమాంటిక్ గా కనిపించే మహేష్ చరణ్ లు ఆ షాట్ పూర్తి కాగానే చాల సభ్యతగా తనతో మాట్లాడుతూ తమ ఇంటి అమ్మాయితో ప్రవర్తించే విధంగా సంస్కార వంతంగా మాట్లాడుతారని అటువంటి వాతావరణం తనకు బాలీవుడ్ లో కనిపించదు అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు మహేష్ చరణ్ లకు షూటింగ్ లంచ్ బ్రేక్ సమయంలో ఇంటి నుంచి వచ్చే క్యారేజ్ లోని వివిధ రకాల వంటలను తనకు రుచి చూపెడుతూ తన ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకు వచ్చిన విషయాలు వివరించింది కియారా అద్వాని.

అంతేకాదు నమ్రత ఉపాసనలు తనతో చాల స్నేహ పూర్వకంగా ఉంటూ మధ్యమధ్యలో తనను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలకు షాపింగ్ కు తీసుకు వెళ్ళిన విషయాలను కూడ గుర్తుకు చేసుకుంటోంది ఈ క్రేజీ బ్యూటీ. ఇలా టాలీవుడ్ హీరోల పై ప్రసంసలు కురిపిస్తూ కియారా చేసిన కామెంట్స్ ను బట్టి ఇంకా తాను చాలకాలం బాలీవుడ్ తో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తాను అంటూ ఆమె ఇస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: