వైసీపీలో టిక్కెట్ల కోసం ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.. ఆ పార్టీ విజయావకాశాలు బావున్నట్టు వార్తలు వస్తుండటంతో రాజకీయాలతో సంబంధం లేని ప్రముఖులు కూడా చాలా మంది వైసీపీ టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆ క్రమంలో సినీజనం కూడా వైసీపీ టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు.

ntr vs nagarjuna కోసం చిత్ర ఫలితం


ప్రత్యేకించి గుంటూరు ఎంపీ సీటు హాట్ సీటుగా మారిందని టాక్ వస్తోంది. నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ఇటీవల లోటస్ పాండ్ లో జగన్ ను కలిశారు. ఆయన ప్రధానంగా గుంటూరు ఎంపీ సీటు కావాలని కోరినట్టు తెలిసింది. మరోవైపు ఇదే సీటు కోసం నాగార్జున కూడా ప్రయత్నిస్తున్నారని వార్తలు వచ్చాయి.



అయితే నేరుగా నాగార్జున రంగంలోకి దిగే ఛాన్స్ లేదు. ఆయన తన స్నేహితుడి కోసం గుంటూరు సీటు అడుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను నాగార్జున ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. మరోవైపు గుంటూరు నుంచి టీడీపీ తరుపున గల్లా జయదేవ్ మరోసారి బరిలో దిగుతారు.

ntr vs nagarjuna కోసం చిత్ర ఫలితం


నాగార్జున తనకు కూడా స్నేహితుడని.. ఆయన గుంటూరు నుంచి బరిలో దిగరని ఆయన చెబుతున్నారు. మొత్తానికి గుంటూరు సీటుపై ప్రముఖులు చాలా మందే ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ తరపున టికెట్ ఫిక్స్ అయినందువల్ల వైసీపీ టిక్కెట్ కోసం ప్రయత్నాలు జోరందుకున్నాయి. మరి జగన్ ఎవరి కోరిక మన్నిస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: